కొత్త జిల్లాల పీటముడి.. బంద్ బాట పడుతున్న ప్రజలు

Publish Date:Jan 28, 2022

Advertisement

ఎక్కడ కెలికినా ఓకే. సెంటిమెంట్లను మాత్రం కెలక్కూడదంటారు అనుభవజ్ఞులు. సెంటిమెంట్లు గాయపడితే సెంటు భూమి కోసమైనా వెనక్కి తగ్గదు ప్రజానీకం. ఇప్పడదే జరిగింది నర్సాపురంలో పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పాటవుతున్న నర్సాపురం జిల్లాకు భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై నర్సాపురం ప్రజలు భగ్గుమన్నారు. నర్సాపురం పేరుతోనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని లేకపోతే ఊరుకునే సమస్యే లేదని అక్కడి వ్యాపార-వాణిజ్య వర్గాలు, సామాన్య ప్రజలు బంద్ కు పిలుపునిచ్చారు. స్థానిక రాజకీయ నాయకులు ప్రజాభిప్రాయంతో రంగంలోకి దిగారు. జిల్లా కేంద్ర సాధన పేరుతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని నర్సాపురం నియోజకవర్గం మొత్తం శుక్రవారం బంద్ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని వర్తక వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.

ఏపీలో కొత్త జిల్లాల పేర్ల విషయంలో స్థానికంగా వివాదాలు మొదలయ్యాయి. నియోజకవర్గాల సర్దుబాటు, కూడికలు, తీసివేతలు, దూరాభారాలు, కులం కొట్లాటలు, ఆస్తుల పంపకాలు, రాజకీయ కుట్రలు, కుతంత్రాలు ఇలా అన్ని రకాలుగా తేనెతుట్టె కదిలింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. నిజానికి నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా కాకుండా భీమవరాన్ని ప్రకటించడంలోని ఔచిత్యాన్ని ముందుగా మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ప్రశ్నించారు. జిల్లా కేంద్రం విషయంలో నర్సాపురం ప్రజలు, రాజకీయ నాయకులు ఓడిపోయారని, భీమవరం ప్రజలు, రాజకీయ నేతలు గెలిచారంటూ వ్యాఖ్యానించారు. భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించిన జగన్ రెడ్డి సర్కార్ ఏ కులాన్ని సపోర్ట్ చేస్తున్నారో స్పష్టంగా తెలిసిపోయిందంటూ  నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. మరో పక్కన ఇప్పటి వరకు ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తగా ఏర్పాటయ్యే ఏదో ఒక జిల్లాకు దళితజన బాంధవుడు బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ ను దళితులు తెర మీదకు తెచ్చారు.

ఇక విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడంపైనా విమర్శలు వస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. నందమూరి తారక రామారావు పుట్టింది పామర్రు మండంలోని నిమ్మకూరు గ్రామం. కొత్త జిల్లా ఏర్పాటు ప్రకారం ఆ గ్రామం ఇప్పుడు మచిలీపట్నం జిల్లాలోకి వస్తుంది. నిజంగా ఎన్టీఆర్ పట్ల జగన్ రెడ్డి సర్కార్ కే కనుక గౌరవం, అభిమానం ఉంటే మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టకుండా విజయవాడ జిల్లాకు పెట్టడంలో ఔచిత్యాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తుండడాన్ని స్వాగతించారు. అయితే.. దీని వెనుక జగన్ రెడ్డి రాజకీయ వ్యూహం ఏదో ఉండి ఉంటుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పైకి ఎన్టీఆర్ ను గౌరవించినట్లు ఉన్నా.. జగన్ రెడ్డి మాటలు, చేతలు జనం నమ్మేలా లేవని అన్నారాయన.

కొత్త జిల్లాల ప్రకటనతో జగన్ రెడ్డి నేమ్ గేమ్ ఆడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాడేరుకు అల్లూరి సీతారామరాజు జిల్లా అని, పుట్టపర్తి ప్రాంతానికి శ్రీ సత్యసాయి జిల్లా అని, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లా అని కొత్త పేర్లతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలనే స్కెచ్ ను జగన్ రెడ్డి వేశారని అంటున్నారు. వైఎస్సార్ కడప జిల్లా అని గతంలో పెట్టిన పేరును పూర్తిగా తుడిచిపెట్టిన జగన్ రెడ్డి సర్కార్ కడప ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిచెందిన వీరబ్రహ్మేంద్ర స్వామి పేరును  విస్మరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అలాగే.. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొన్ని గ్రామాలు, మండలాలకు జిల్లా కేంద్రాలు వందల కిలోమీటర్ల దూరం అయిపోతున్నాయి. దీంతో కొత్త జిల్లా పరిధిలోకి వెళ్లిన ప్రాంతాల వారు ఇదేమి చోద్యం అని ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాలు, చిన్న జిల్లాల ఏర్పాటును బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు సమర్థిస్తూనే.. కొత్త జిల్లాల్లో విలీనం చేసే ప్రాంతాలు, ప్రధాన కార్యాలయాల ఎంపిక, పేర్లకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు కమిటీ వేయాలని సూచిస్తున్నారు. తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాగా పేరు పెట్టడాన్ని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఉత్తర భారతంలో బాలాజీ అంటే ఆంజనేయస్వామిగా భావిస్తారంటున్నారు. బాలాజీ ఆంధ్రుల సంస్కృతి కాదని, తిరుపతి జిల్లాకు శ్రీ వేంకటేశ్వర జిల్లా అని పేరు పెడితే బాగుంటుందంటున్నారు.

విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడంపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. విజయవాడ కేంద్రంగా వంగవీటి రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని స్పందించడం విశేషం. అలాంటి డిమాండ్ మెజారిటీ ప్రజల నుంచి వస్తే పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెబుతున్నారు. అయినా.. అలాంటి డిమాండ్ ను జగమొండి సర్కార్ నిజంగా పరిగణనలోకి తీసుకుంటుందా? అనే అనుమానాలు పలువురిలో లేకపోలేదు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటును అర్ధరాత్రి ప్రకటించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. కేబినెట్ లో చర్చించకుండానే అకస్మాత్తుగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన ఎలా చేస్తారనేది ఆయన ప్రశ్న.

ఈ నేపథ్యంలోనే ఏపీ ప్లానింగ్ విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ తెరమీదకు రావడం.. సీఎం జగన్ ప్రణాళికను, ఆయన పవిత్ర ఆశయాన్ని కూడా వివరించడం కూడా ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. విజయ్ కుమార్ వివరణ విన్న వారికి పాత అనుమానాలు తీరక పోగా జగన్ నిర్ణయం వెనుక ఏ కుట్ర దాగి ఉందో అనే సందేహాలే ఎక్కువయ్యాయంటున్నరు రాజకీయ విశ్లేషకులు. అసలు కొత్త జిల్లా చిచ్చు రాజేయడమే జగన్నాటక సూత్రధారి మహా కుట్ర అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త జిల్లాలు, కొత్త సమీకరణలు, పరిపాలన, రాజకీయ, భౌగోళిక అంశాలపై తీవ్ర ప్రభాం చూపే కీలకమైన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను అర్ధరాత్రి తంతుగా వైసీపీ మార్చడంపైన కూడా విమర్శలు వస్తున్నాయి.

నర్సాపురం ప్రజలు, వర్తక వాణిజ్య సంఘాలు, విద్యా సంస్థలు ఇప్పుడు నేరుగా ఆందోళనలోకి దిగారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని చోట్ల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో ఏపీ వ్యాప్తంగా కులాలు, ప్రాంతాలు, వర్గాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టి, చలి కాచుకుందామనే వ్యూహం ఉందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

 

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.