ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. గత ఐదేళ్ల జగన్ హయాంలో మూడు రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిర్ణీత కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో అమరావతి నిర్మాణం పరుగులు పెట్టించేందకు చంద్రబాబు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు ఏవీ, ఏ పనులు ఏంత మేర పూర్తి అయ్యాయి, నిలిచిపోయిన భవనాల సామర్ధ్యం ఇప్పుడు ఎలా ఉంది. మరమ్మతులు చేసి వినియోగించుకోవడానికి అవకాశం ఉందా అన్న అంశాలపై సీఆర్డీయే దృష్టి సారించింది. ఇప్పటికే అమరావతికి సంబంధించి అన్ని నివేదికలు తెప్పించుకున్న సీఎం… కీలక సీఆర్డీయే సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సీఆర్డీఏ సమావేశం జరగడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహా 11మంది సభ్యులు హజరుకానున్నారు.
ఆగిపోయిన నిర్మాణాలు పనికొస్తాయా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు అమరావతికి ఐఐటీ నిపుణులు రానున్నారు. అలాగే గతంలో నిలిచిపోయిన భూసేకరణ, కొత్తగా దరఖాస్తు చేసుకున్న కంపెనీలకు భూ కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 15వేల కోట్ల నిధుల వ్యయం , అందుకు విధి విధానాలతో పాటు ఈ సమావేశంలో విధానపరమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నిర్మాణాల విషయంలో సీఎం అక్కడికక్కడే సూచనలు చేసే వీలుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుండే అన్ని కార్యకలాపాలు జరిగేలా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే శాశ్వత నిర్మాణాలను నిర్దుష్ట గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఇప్పటికే సీఆర్డీఏకు సూచించారు. అవసరం అయితే సీఆర్డీఏలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/action-plan-ready-to-complete-amarawati-39-182067.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.