ఫోర్బ్స్ ప్రకారం భూమిపై అత్యంత శక్తివంతమైన ఏడుగురు మహిళలు

Publish Date:Dec 3, 2020

Advertisement

ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. వారిలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ప్రతి ఏటా ఫోర్బ్స్ సంస్థ  వెల్లడిస్తోంది. తాజాగా ఫోర్బ్స్ వెల్లడించిన జాబితా ప్రకారం అత్యంత శక్తివంతమైన మహిళల్లో మొదటి ఏడుగురి గురించి తెలుసుకుందాం...


1 ఏంజెలా మెర్కెల్,(Angela Merkel)
ఛాన్సలర్, జర్మనీ

 జర్మనీ రాజకీయాల్లో సంచలన నేత ఏంజెలా మెర్కెల్. శాస్త్రవేత్తగా ఎన్నో పరిశోధనలు చేసిన ఆమె రాజకీయాల్లోనూ అరుదైన రికార్డులు సృష్టించారు. ఆమె 2005 లో జర్మనీకి మొదటి మహిళా ఛాన్సలర్ అయ్యారు.  ఆ తర్వాత వరుసగా నాల్గవసారి ఆమె ఛాన్సలర్ గా పనిచేస్తున్నారు. ఆమె వయసు 66 సంవత్సరాలు. ఆమె జర్మనీలోని  బెర్లిన్ లో నివసిస్తున్నారు.

జర్మనీలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.  యూరోప్‌లో  పెరుగుతున్న వలస వ్యతిరేక భావనతో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.  మెర్కెల్ జర్మనీకి ఛాన్సలర్ కాకముందు శాస్త్రవేత్త. ఆమె భౌతిక రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేసి  క్వాంటం కెమిస్ట్రీపై  థీసిస్ రాశారు. లీప్జిగ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసిన ఆమె అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఆమె "శరణార్థులను కాపాడటంలో యూరోప్ విఫలమైతే అది మనం కోరుకున్న యూరోప్ కాదు." అంటూ ఆమె తన గళాన్ని గట్టిగానే వినిపిస్తారు.

2.  క్రిస్టిన్ లాగార్డ్ (Christine lagarde)
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి

యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుకు అధిపతి అయిన మొదటి మహిళగా క్రిస్టిన్ రికార్డు సృష్టించారు. నవంబర్ 1, 2019 న ఆమె ఈ అరుదైన అవకాశాన్ని అందుకున్నారు.  ఆమె ప్రపంచ ద్రవ్య వ్యవస్థ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి పనిచేసే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు  2011 నుండి 2019 మధ్యకాలం వరకు సారధ్యం వహించారు. ఆమె వయసు 64 సంవత్సరాలు. కొలంబియా జిల్లాలోని వాషింగ్టన్ లో ఆమె నివసిస్తున్నారు.

క్రిస్టిన్ టీనేజ్ లో మంచి స్మిమ్మర్ గా గుర్తింపు పొందారు. అంతేకాదు ఫ్రెంచ్ స్మిమ్మర్స్ టీమ్ లో సభ్యురాలు. యూరోపియన్ ఆర్థిక వృద్ధి మందగించే సమయంలో ఆమె ద్రవ్య విధానానికి బాధ్యత వహిస్తూ అంతర్జాతీయ ద్రవ్య నిధిని నడిపించారు. దేశీయ అవకాశాలను పెంచుకుంటూ బహుపాక్షిక వాణిజ్యంపై దృష్టి సారించారు. ఆమె వయసు 64. కొలంబియా జిల్లాలోని వాషింగ్టన్ లో ఉంటున్నారు.

3.  నాన్సీ పెలోసి (Nancy pelosi)
యు.ఎస్. ప్రతినిధుల సభకు స్పీకర్.

యు.ఎస్. ప్రతినిధుల సభకు నాన్సీ పెలోసి 52 వ స్పీకర్. ఈ పదవి ఆమెను దేశంలో అత్యధిక ర్యాంకు పొందిన మహిళగా  నిలబెట్టింది.     2013 లో జరిగిన కార్యక్రమంలో ఆమెను నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చారు. 2007 నుంచి 2011 వరకు స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించిన ఆమె మరోసారి 2019 లో స్పీకర్‌గా ఎన్నుకోబడ్డారు. అంతేకాదు యుఎస్ చరిత్రలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నాల్గవసారి అభిశంసన విచారణను ఆమె 2019 లో ప్రారంభించారు.

ఆమె  కాలిఫోర్నియాలోని  శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తారు.  ట్రినిటీ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ / సైన్స్ పూర్తి చేశారు. వివాహం చేసుకుని ఐదుగురు  పిల్లల తల్లిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

4 ఉర్సులా వాన్ డెర్ లేయన్ (Ursula von der leyen)
అధ్యక్షులు, యూరోపియన్ కమిషన్,

 యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అయిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షపదవిలో జూలై 2019 లో ఉర్సులా వాన్ డెర్ లేయన్ నియమితులయ్యారు. ఈ పదవికి ఎన్నికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు ఉర్పులా. అంతేకాదు ఏంజెలా మార్కెల్ క్యాబినెట్‌లో 2005 నుండి 2009 వరకు అతి ఎక్కువ కాలం పనిచేశారు. గతంలో ఏ క్యాబినెట్ సభ్యులు కూడా ఈ పదవిలో ఎక్కువ కాలం పనిచేయలేదు. కేబినెట్‌లో ఉన్న చివరి ఆరు సంవత్సరాలుగా ఆమె జర్మనీ రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్న ఆమె  బెల్జియంలో నివసిస్తున్నారు.

5. మేరీ బరా (Mary barra)
సీఈఓ, జనరల్ మోటార్స్

మేరీ  2014 నుండి జనరల్ మోటార్స్ CEO. డెట్రాయిట్ బిగ్ త్రీ వాహన తయారీ సంస్థ ఆమెకు అత్యధిక పరిహారంగా  2018 లో 21.9 మిలియన్ డాలర్లు అందించింది. ఆమె ఎలక్ట్రిక్ వాహనాలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు  మావెన్ అనే రైడ్-షేర్ సేవలలో బిలియన్ల పెట్టుబడులు పెట్టారు. మేరీ ఆటోమొబైల్ వాహన తయారీ సంస్థకు నేతృత్వం వహించిన  మొట్టమొదటి మహిళా.  ఆమె వయసు 58 సంవత్సరాలు. మిచిగాన్ లోని నోవిలో ఆమె నివాసం ఉంటున్నారు. USA సిటిజన్ షిప్ కలిగిన మేరీ వివాహం చేసుకుని ఇద్దరు  పిల్లల తల్లిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కెట్టెరింగ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ / సైన్స్, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టాలను అందుకున్నారు.

6.  మిలిండా గేట్స్(Melinda gates)
కో-చైర్, బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్

మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థపకురాలు. దాతృత్వంలో అత్యంత శక్తివంతమైన మహిళగా తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు.

2000 లో స్థాపించబడిన మిలిండా గేట్స్ ఫౌండేషన్ 40 బిలియన్ల ట్రస్ట్ మూలధనంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఛారిటబుల్ ఫౌండేషన్ గా ఏర్పడింది. ఈ ఫౌండేషన్ లక్ష్యం విద్య అందించడం, పేదరిక నిర్మూలన, పారిశుధ్యం, ఆరోగ్యం అందించడం మొదలైనవి. కఠినమైన  సవాళ్లను పరిష్కరించడంలో మిలిండా ఎక్కువగా కృషి చేస్తారు.ప్రజలందరికీ ఆరోగ్యకరమైనక జీవితాలను అందించే  ఫౌండేషన్ మిషన్‌లో భాగంగా  ఆమె ఎక్కువ భాగం మహిళలు, బాలికల హక్కుల సాధన కోసం  పనిచేశారు. ఆమె వయసు 55 సంవత్సరాలు. మదీనా, వాషింగ్టన్ లో ఆమె నివాసం.  బిల్ గేట్స్ ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. డ్యూక్ విశ్వవిద్యాలయం లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ / సైన్స్, ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్ లో  మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.

7 అబిగైల్ జాన్సన్ (Abigail Johnson)
CEO, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్

ఆమె ఆస్తుల విలువ 15 బిలిియన్ డాలర్లు.   అబిగైల్ జాన్సన్ 2014 నుండి ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్  CEO గా పనిచేశారు, ఆమె తన తండ్రి నుంచి 2016లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి చైర్మన్‌గా ఉన్నారు.  ఆమె తాత, ఎడ్వర్డ్ జాన్సన్ II మ్యూచువల్ ఫండ్ సంస్థను 1946 లో బోస్టన్ లో స్థాపించారు. ఆ సంస్థలో ఆమె వాటా 24.5శాతం. అంటే దాదాపు 2.9 ట్రిలియన్ డాలర్లు. జాన్సన్ కుటుంబం బోస్టన్ ప్రాంతంలో లాభాపేక్షలేకుండా అనేక దానధర్మాలు చేస్తుంది. అంతేకాదు న్యూ ఇంగ్లాండ్ లోని చారిత్రాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సహాకారం అందించింది.
 
ఆమె మసాచుసెట్స్ లోని మిల్టన్ లో నివసిస్తున్నారు.  యుఎస్ పౌరసత్వం ఉన్న జాన్సన్ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.

By
en-us Political News

  
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.