ప్రణబ్ కు 25 బెంజ్ కార్లు
Publish Date:Jul 26, 2012
Advertisement
రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ప్రణబ్ ముఖర్జీ ప్రయాణించిన బెంజికారు గురించి మీకు తెలుసా... ఆయన ఇంతకు ముందుబుల్లెట్ప్రూఫ్ అంబాసిడర్ కారులో తిరిగేవారు. ఇప్పటి ఈ బ్లాక్ కారు స్వాన్కీ మెర్సిడెస్ బెంజ్కార్ లో మోడల్ బ్లాక్ యస్ పుల్మ్యాన్ లగ్జరీకారు. దీని ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల ఆరు కోట్లు. దీని టైరు రేటే మూడు నుండి 5 లక్షల వరకు ఉంటుంది. బెంజ్ వేగం గంటకు 300 కి.మీ .ఈ కారు పెట్రోలు ట్యాంకు కెపాసిటీ 90 లీటర్లు. దీనిలో ఉన్న సౌకర్యం ఏమంటే ఇది ఎంత స్పీడుగా వెళుతున్నా ఏమాత్రం కుదుపులు వుండకుండా దీనికి స్పెషల్ షాక్ ఎబ్జార్భర్స్ ఉంటాయి. ఈ బెంజ్ కారుకి ప్రమాదకరమైన హ్యాండ్ గ్రేనేడ్స్ని , బాంబు దాడులను తట్టుకునే శక్తి ఉంది. దీని బాడీని అత్యంత శక్తివంతంగా తయారు చేశారుమరి. దీని బరువు 3 టన్నులు. ఈ కారు కోసం వాడిన స్టీలు పఠిష్టమైనది. ఇది నూనెపోసిన రోడ్లమీద కూడా రయ్యిన దూసుకుపోగలదు. ఈ కారులో సీట్లు ఎదురెదురుగా కూర్చుంటానికి వీలుగా ఉంటాయి. దీనివల్ల ఫారిన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు గాని ముఖ్యవ్యక్తులతో గాని కారులోనే కూర్చుని మీటింగు పెట్టుకునే వీలు ఉంటుంది. దీనిలో టివి తోపాటు అత్యాధునిక టెక్నాలజీ అంతా దానిలో ఉంటుంది. ఎసి మామూలే.కారుకు అమర్చిన స్పెషల్ గ్లాసువల్ల సౌండు ఫ్రూఫ్గా పనిచేస్తుంది. కాబట్టి మొదటిపౌరుడికి ఏకాగ్రతకు భంగం వాటిల్లదు. ఇలాంటి కార్లు సుమారు 25 కార్లు ఇండియన్ ప్రెసిడెంట్ కి ఎల్లప్పుడు అందుబాటులో వుంటాయి.
http://www.teluguone.com/news/content/-president-pranab-24-15980.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





