కర్మయోగికి ... ఏంటి ఖర్మ!

Publish Date:Sep 9, 2016

Advertisement

అనగనగా ఓ అభాగ్యుడు! అతను రోడ్డుపై వెళుతుంటే హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు! అప్పుడే అటుగా వెళుతున్న ఓ పెద్దాయన అతడ్ని చూసి తల్లడిల్లిపోయాడు. అరెరే పాపం అనుకుని తన వద్ద వున్న నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లాడు. లేపి కూర్చోపెట్టి కాసిన్ని మంచి నీళ్లు తాగించాడు. మొత్తానికి సృహ తప్పిన అభాగ్యుడు ఇప్పుడు లేచి కూర్చున్నాడు! అంతలోనే ఏమైందో తెలుసా?  స్పృహ తప్పిన అభాగ్యుడి బంధువులు ఎక్కడ్నుంచో రొమ్మలు బాదుకుంటూ వచ్చి పడ్డారు. తమ వాడు స్పృహ తప్పే దాకా చేష్టలుడిగి చూసిన ఆ దిక్కుమాలిన సంత ఇప్పుడు మాత్రం మా వాడికి కేవలం మంచి నీళ్లు తాగిస్తావా? కొబ్బరి నీళ్లు ఎందుకు తీసుకురాలేదు? సెలైన్ ఎందుకు ఎక్కించలేదు? అంటూ పెద్దాయన మీద పెంట పందుల్లా పడిపోయారు! దీన్నేమందం?

తాను ధరించే పంచె తెల్లదనం, తాను వేసే పంచుల్లో వుండే హాస్యం ఎంత నిఖార్సుగా వుంటాయో... అంత నిఖార్సైన సీన్సియర్ అండ్ సీనియర్ నేత వెంకయ్య నాయుడు! ఆయనే ఇంతదాకా మనం చెప్పుకున్న కథలో పెద్దాయన! హఠాత్తుగా స్పృహ తప్పిన అభాగ్యుడే... అవశేష ఆంధ్ర రాష్ట్రం! ఇక బంధువులు ఎవరు అంటారా? ఎవరైతే హైద్రాబాద్ కు దూరమై, నానా హైరాన పడి ఇంకా కోలుకోలేకపోతోన్న నవ్యాంధ్ర ఏర్పాటుకి కారకులో... వారే! అంటే ఇక్కడా, అక్కడా అధికారంలో వుండి సమైక్యాంధ్రని సమస్యాత్మకంగా విభజించిన కాంగ్రెస్! ఆ కాంగ్రెస్ లోంచే కపటంగా పుట్టుకొచ్చిన పిల్ల కాంగ్రెస్! 

2009 నుంచీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశాన్ని నాన్చి, నాన్చి, కుళ్లిపోయేలా చేసి, దేశమొత్తం దుర్వాసన వ్యాపించేలా చేసి... అప్పుడు విభజనకి పూనుకుంది కాంగ్రెస్. 2014లో చిట్టచివరి రోజున పార్లమెంటు తలుపులు మూసేసి తెలుగు ప్రజల మధ్య తన ఇష్టానుసారం అడ్డుగీత గీసి రాష్ట్ర విభజన అయిందనిపించింది. అటువంటి సమయంలోనే మన వెంకయ్య నాయుడు రాజ్యసభ వేదికగా గళమెత్తారు. అసలు అనాడు రాష్ట్రం తరుఫున సభలో కూర్చున్న ఏ తెలుగు ఎంపీ అడగకున్నా ... కర్ణాటక నుంచి ఎంపీ అయిన ఆయనే... ప్రత్యేక హోదా కోసం గొంతు చించుకున్నారు. మాట్లడటమే మహాబాగ్యం అన్నట్టు కూర్చునే  మౌనమోహన సింగ్ చేత మాట ఇప్పించారు. ప్రత్యేక హోదా ఇస్తామనిపించారు! అంటే... ఆ రోజు ఇదే వెంకయ్య ... నాకుందుకయ్యా అనుకుంటూ ఊరుకుని వుంటే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏమై వుండేది? ఇవాళ్ల ప్రత్యేక హోదా కావాల్సిందే అంటూ సర్కాస్ చేస్తోన్న జోకర్ సన్నాసులంతా సోదిలో కూడా వుండేవారు కాదు! ఈ మధ్యే ఏర్పడ్డ ఛత్తీస్ గడ్, జార్ఖంఢ్ లకు కేంద్రం ఏ  ప్రత్యేక హోదా ఇస్తోంది? అలాగే మనమూ మట్టిగొట్టుకు పోయేవాళ్లం. 

అనాడు కాంగ్రెస్ పన్నిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు అమోదం అనే పద్మవ్యూహంలో వెంకయ్య తెగించి నిలిచారు. నినదించి ప్రత్యేక హోదా హామీ సాధించారు. ఆ ఒక్క పని వల్లే ఇవాళ్ల ఆయన పంచె వుడదీసి కొడతామని పిట్టల దొరల్లా మాట్లాడుతోన్న కామెడీగాళ్లకు విషయం దొరికింది. ఊడదీయాల్సింది వెంకయ్య పంచె కాదు... తరిచి చూడాల్సింది ఆయన మనసులోని నిజాయితీ. ఆంధ్రుడై పుట్టినందుకు అవమానాలు ఎదురైనా, అడ్డంకులు ఎదురైనా, అడ్డమైన వాళ్ల విమర్శలు వినాల్సి వస్తోన్న ఆయన ఢిల్లీలో తెలుగు సంక్షేమం సాధిస్తున్నారు!

సింహం లాంటి సింహపురి పెద్దాయన తనే స్వయంగా చెప్పినట్టు ... తన వల్లే చర్చలోకి వచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని తనకే వ్యతిరేకంగా సంధిస్తున్నారు లెఫ్టు లిల్లీపుట్లు, వైసీపీ వైరీ పక్షం వారు. కాని, దేశం మొత్తంలోని అన్ని పార్టీలు కలిసి అమోదించిన 14వ ఆర్దిక సంఘం సిఫారసులు ప్రత్యేక హోదా అసాధ్యం చేశాయి. ఇది 2014లో వెంకయ్య హోదా అడిగిన నాడు లేని పరిస్థితి. కాని, ఇప్పుడంతా తలకిందులైంది. అయినా ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక ప్రకటనగా మారింది! దీనికి కారణం ఎవరు? వైసీపీ ఎంపీలా? పోనీ టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులా? 282సీట్లున్న మోదీ సర్కార్ సైకిల్ ను చూసి నిజంగా గజగజ వణికిపోతుందా? అసలు వాస్తవ పరిస్థితుల్లో జైట్లీ లాంటి ఉత్తరాది నేతలు మన తెలుగు నేతల మాటలు వింటారా? పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మనోళ్ల హిందీ ఢిల్లీ నాయకులకి అర్థం అవుతుందా? ఈ అన్ని ప్రశ్నలు సరిగ్గా వేసుకుంటే వచ్చే సమాధానం... వెర్సటైల్ వెంకయ్య నాయుడు! 

బీజేపిని శాసించే అరెస్సెస్ నుంచి లాలూ నడిపించే ఆర్జేడీ వరకూ వెంకయ్యని గౌరవించనిదెవరు? ఇంగ్లీష్లో ట్రబుల్ షూటర్ అంటూ జాతీయ మీడియా కూడా చెప్పుకొచ్చే వెంకయ్య గారి అనర్గళమైన హిందీనే ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికొచ్చినంతైనా తీసుకొచ్చింది. ఒక్కసారి ఆలోచించండి... మొన్నటి దాకా కర్ణాటక నుంచి, ఇప్పుడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ నాయుడుగారే లేకుంటే... కొత్త రాష్ట్రం ఎంతగా నాశనం అయ్యేదో!

ఊరికే మాటలు కాదు... వెంకయ్య వేయి మార్గాల్లో ప్రత్యేక హోదా అనే టానిక్ తప్పి పోయిన ఏపీకి... టాబ్లెట్స్ వేయిస్తున్నారు! అవ్వేవీ లేకపోతే, ఇక ముందు ఆయన చొరవతో వచ్చేవి రాకపోతే... ఏపీ కూడా మరో కొత్తగా ఏర్పడ్డ వెనుకబడిన రాష్ట్రమైపోతుంది! ఇది ఒట్టి మాట కాదు... గట్టి తార్కణం వున్న సత్యం.మోదీ ప్రధానిగా కొలువుతీరిన మొట్ట మొదటి క్యాబినేట్ నిర్ణయాలు గుర్తున్నాయా? పోలవరం ముంపు మండలాల్ని ఆంద్రలో కలిపారు! అంటే పాలన మొదలైన మొదటి రోజు నుంచే ఏపీకి లబ్ది చేకూరుతోంది. ఇందులో సాక్షాత్తూ మోదీ కంటే సీనియర్ అయిన మన వెంకయ్య నాయుడు పాత్రేం లేదంటారా? పోలవరం ఆంధ్రలకి అమృత కలశం లాంటిది. దాన్ని సుసాధ్యం చేయటానికి కేంద్ర మంత్రిగా ఆయన చేస్తున్న కృషేం లేదంటారా? ఆయన ప్రమేయం లేకుండానే ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాలన్నీ పోలవరం కట్టుకొమ్మని చెప్పేస్తాయా? అసలు వేల కోట్ల పోలవరానికి వంద శాతం కేంద్ర నిధులు ఎవరు తీసుకొచ్చారు? ఖాళీ సమయం దొరికినప్పుడు సభలు, ప్రెస్ మీట్లు పెట్టే గడ్డం పెంచుకున్న టాలీవుడ్ హీరోలా? ఈ రియల్ హీరోనే కదా... జనానికి నేరుగా కడుపునింపే ప్రతీ పైసా ఢిల్లీ నుంచి తెస్తోంది!

తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ తొలి రొజులు గుర్తున్నాయా? ఆంధ్రప్రదేశా? అంధ ప్రదేశా అన్న అయోమయం వుండేది. అంతటి విద్యుత్ లోటు ఈ విల్లు చేతిలో లేని వీరుడే కదా పూడ్చింది. మోదీ సర్కార్ 24గంటల ఉచిత విద్యుత్ తమ బీజేపి రాష్ట్రాల్ని పక్కన పెట్టి టీడీపీ పాలిత రాష్ట్రానికి ఎందుకిచ్చింది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెంకయ్య నాయుడి స్వరాష్ట్రం కాబట్టి! బీజేపి నేతల దృష్టిలో ఏపీకి వుండే గుర్తింపు అదే! ఒక గుజరాత్ మోదీది, ఒక ఉత్తరప్రదేశ్ వాజ్ పేయ్ ది, ఒక ఆంధ్రా వెంకయ్యది! అంతలా ఆయన తన మాతృభూమి కోసం ఆరాటపడతారు. అందుకు ఏ మాత్రం సిగ్గుపడరు. ఒక సారి తెలంగాణ వాదులు నిందమోపినా, ఇప్పుడు తెంపరితనంతో ఆంధ్ర నేతలే అమానుషంగా మాట్లాడుతున్నా.... ఆయన అనుక్షణం తెలుగు తల్లి కోసం తల్లడిల్లుతూనే పుంటారు! అదే ఆయన గొప్పతనం, ఇంకా చెప్పాలంటే తెలుగుజాతి కోసం తపించే వెంకయ్యదనం!

కేవలం పోలవరంతో నీళ్లు ఇచ్చి, విద్యుత్ వెలుగులతో ఇళ్లు వెలిగించి చేతులు దులుపుకోలేదు ఈ తెలుగు వారి రెండో వెంకన్న! తిరుపతి లడ్డుల్లాంటి ఎన్నో తియ్యనైన , మహా ప్రసాదం లాంటి ప్రాజెక్ట్ లు తీసుకొచ్చారు. విద్యారంగమైన ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్, ఐఐటీ సహా ఎన్ని సంస్థలు వచ్చాయో తరచి చూసుకోండి. పారిశ్రామిక రంగమైతే ఇప్పటికే వచ్చిన ఫ్యాక్టరీలు, రేవులు కాదు రానున్న విశాఖ, చేన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటో తెలుసుకోండి. దాని వల్ల కలిగే లాభాలేంటో ఓపికున్నంత సేపు చర్చించుకోండి! రోడ్ల కోసం గడ్కరీని, విమానాల కోసం మన వాడే అయిన అశోక్ గజపతిని, రైల్వేల కోసం సురేష్ ప్రభూని, మొత్తంగా ఆంధ్రా మౌలిక సదుపాయాల కోసం వీలున్నప్పుడల్లా మోదీని... ఎవరు అడుగుతున్నారు? అప్రమత్తం చేస్తున్నారు? 

ఇలా చెబుతూ పోతే అత్యంత సుదీర్ఘమైన వెంకయ్య రాజకీయ జీవితంలానే అంతం లేకుండా పోతుంది ఆయన నూతన తెలుగు రాష్ట్రానికి చేసిన మేలు కూడా! ఇక్కడ చెప్పుకోవాల్సింది కర్మయోగి లాంటి వెంకయ్య చేసిన పనుల గురించి కాదు! ప్రతిఫలం ఆశించని ఆయనకు ఈ విమర్శల ఖర్మేంటని? అసలు మీడియా, ప్రతిపక్షాలు, మేధావులు అందరూ కలిసి ఒక రాజస్తాన్ కు చెందిన రాజ్యసభ సభ్యుడ్ని తెలుగు వారికి ద్రోహం చేశాడంటున్నారంటేనే... ఆయనేదో జనానికి ఉపయోగపడే నిజమైన మంచి పని చేసుంటాడని అర్థం! అలాంటి జనం వైపున్న వారికే దాదాపుగా అందరికందరూ వ్యతిరేకం అవుతారు! 
వెంకయ్య గారు... మీరు మా నవ్యాంధ్ర రథానికి శ్రీకృష్ణుడి వంటి సారథి. ప్రత్యక్షంగా యుద్ధం చేయలేదు కాబట్టి కురుక్షేత్రంలో కృష్ణుడి పాత్రేం లేదనుకునే వాళ్లని ఎవ్వరం బాగుచేయలేం. అలాగే మీరు తెలుగు వారికి ఏం చేయలేదని వార్ని కూడా సరి చేయలేం! ఆ తోకలు వంకరే...    
 

By
en-us Political News

  
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.