జగన్పై కేసులు త్వరలో కొట్టేస్తారా ?
Publish Date:Jul 28, 2012
Advertisement
జగన్ బెయిల్ పిటీషన్ సుప్రీంకోర్టునుండి విత్డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. కారణాలు ఏమైవుంటాయా అని రాష్ట్రరాజకీయ నాయకులంతా ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. వివారాలలోకి వెళితే వైసిపి పార్టీ తన బద్ద శత్రువైన కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రణబ్కు ఓటు వేయడం ద్వారానే రాష్ట్రంలో చాలా విమర్శల పాలయింది. విపక్షాలకు వైసిపి నేతలు చాలా వివరణలు ఇచ్చుకోవలసి వచ్చింది.అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ వైసిపి కుట్రలపార్టీ అది ఖచ్చింతంగా మా ప్రత్యర్ధి పార్టీనే అని తేల్చిచెప్పడంతో తాత్కాలికంగా దాని విషయం అన్ని ప్రధాన పార్టీలు ప్రక్కన పెట్టాయి. సుప్రీంకోర్టులో జగన్కు బెయిలు వచ్చే అవకాశం ఉందని స్వయానా విజయమ్మ చెప్పారు. ఒక వేళ అదే జరిగితే మళ్ళీ జగన్వర్గంపై కాంగ్రేసేతర పార్టీలు దాడి చేసి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్తో కుమ్మక్కయిందని ఆరోపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకిదంతా , ఎలాగూ జగన్ ఇ.డి. విచారణ నుండి తప్పించుకోలేకపోయారు. ఇక నిండా మునిగిన వాడికి చలి ఎందుకనుకున్నారో ఏమో ఇడి విచారణ కూడా ముగిశాక కడిగిన ముత్యంలా బైట పడాలనే ఉద్ధేశంతో బెయిలు పిటీషన్ వెనుకకు తీసుకున్నారని తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కళంకిత మంత్రులకు న్యాయ సహాయం అందిస్తూ మంత్రులకు అక్రమాస్తులతో సంబంధం లేదని కోర్టుకు సంకేతాలు పంపింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆత్మరక్షణా చర్యలు జగన్కు కలసి వచ్చేలా చేశాయి. ఎలాగూ కొట్టేసే కేసుకు బెయిలును కాస్త ముందు తీసుకొని ప్రతిపక్షాలకు పని కల్పించడం కన్నా తనను తాను నిరూపించుకొని బయటపడటం కరెక్టుగా భావించారు. అదే సమయంలో ఏ ఒక్క ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సిబిఐకి లభించ లేదు కనుక కోర్టు తనను నిరపరాధిగా విడుదల చేయగలదు. ఈ సమయంలో బెయిలు పిటీషన్ పెట్టుకొని బయటకు వచ్చి విమర్శల పాలవడం కన్నా అన్ని విచారణలు అయిపోయాక నిర్దోషిగా బయటకు రావడమే మిన్నగా అలోచించి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
http://www.teluguone.com/news/content/-jagan-24-16006.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





