ఇందిరమ్మ బాటతో వోట్లు రాలవు
Publish Date:Jul 28, 2012
Advertisement
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోవడం పట్ల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సంపాదనకు, ఖర్చుకూ పొంతన కుదరని ఈ రోజుల్లో ప్రభుత్వం ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాడానికి సక్రమమైన చట్టం తేవాలని, ఆదాయాలతో నిమిత్తంలేకుండా ప్రజలందరికీ సార్వత్రిక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే స్వామినాధన్ సిఫార్సులకు అనుగుణంగా రైతాంగానికి మద్దతుధర అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణాల్లో రోజుకు 32 రూపాయలు, పల్లెల్లో 28 రూపాయలు ఆదాయం పొందే వారిని పేదవారిగా పరిగణించకూడదంటూ ప్రణాళికా సంఘం చెప్పడం హాస్వాస్పదం. కొన్ని చోట్ల రేషన్ షాపుల్లో ఒకటి రెండు రోజులు మాత్రమే పంపిణీ చేసి మిగతా రేషన్ అంతా నల్లబజారుకు తరలించడం వల్ల చాలా చోట్ల నిరుపేదలు కడుపునిండటం కష్టమవుతుంది.
ఇప్పటికే భారత దేశంలో సమతుల్య ఆహారం కొరత వల్ల ఏటా ప్రజలు అనేక రోగాలు పడుతున్నారు. గ్రామీణ, మద్యతరగతి ప్రజల్లో రక్తహీనత వేథిస్తున్న సమయంలో రాష్ట్రంలో ఆహార భద్రత కోసం గట్టి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాపంపిణీ విధానాన్ని బలోపేతం చేసి పేద కుటుంబాలన్నిటికీ కార్డులు మంజూరు చేయాలి. పేదల బ్రతుకులు బాగు చేయకుండా ఇందిరమ్మ బాటలు పట్టడం ద్వారా ప్రజలకు ఒరిగేది ఏమీ వుండదు. ఇటువంటి బాటలు వోట్లు రాల్చవని గతానుభవాలు చెబుతున్నాయి. కేవలం ఆడంబరాలకోసం ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు జరుపుతుంటారని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా పేద, మద్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందేలా చేసి అర్హులైన వారికి తెల్ల కార్డులు మంజూరు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్దిని రుజువు చేసుకోవాలి.
http://www.teluguone.com/news/content/indiramma-bata-24-16007.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





