ఇండియాను క్షమాపణలు కోరిన మెటా.. ఎందుకంటే?

Publish Date:Jul 28, 2026

Advertisement

సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ మెటా భారత ప్రభుత్వానికీ, అలాగే ప్రధాని కార్యాలయానికీ క్షమాపణలు చెప్పింది. ఇంతకీ మెటా క్షమాపణలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ప్రధాని ఫేస్ బుక్ అక్కౌంట్ నుంచి ఆయన వీడియోను తొలగించింది. ఈ ఘటన తీవ్ర కలకలానికి కారణమైంది.  ఇంతకీ మెటా తొలగించిన వీడియో ఏమిటంటే.. నీట్ లీకేజీపై  ఉద్యమిస్తున్న  యువత, విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు తెస్తామని పేర్కొంటూ ఆయన విడుదల చేసిన సెల్పీ వీడియో  సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసిన స్వల్ప వ్యవధిలోనే   మిలియన్ల సంఖ్యలో వ్యూస్ లభించాయి.

అయితే..  ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే..  ఫేస్‌బుక్ పోస్ట్ వేదిక నుంచి ఆ వీడియో  అదృశ్యమైంది. కంటెంట్ నిబంధనలను ఉల్లంఘించిందనో లేదా చట్టపరమైన అభ్యంతరంఉందనో  ఉందనో చూపే సందేశం ఆ వీడియో క్లిక్ చేస్తే రావడం వినియోగదారులను విస్మయానికి గురి చేసింది. ఈ క్రమంలో ప్రధాని వీడియో అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంపై సోషల్ మీడియాలో  చర్చ మొదలైంది. దీంతో భారత ప్రభుత్వం స్పందించి మెటాను వివరణ కోరింది. దీనిపై మెటా సాంకేతిక లోపం వల్ల అలా జరిగిందనీ, పొరపాటును వెంటనే సరిదిద్ధి ఆ వీడియోను పునరుద్ధరించినట్లు వివరణ ఇచ్చింది.  ప్రధాని మోడీ వీడియోలో నిబంధనల ఉల్లంఘనలేవీ లేవని, అది పూర్తిగా తమ తప్పిదమని అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పింది.  

 IT Ministry Summons Meta, Facebook Video Removal, Meta Apology, Technical Glitch, Paper Leak Message, PM modi Video

By
en-us Political News

  
ఖనిజాల నిధిగా పిలిచే మన నేల పొట్టలో అపారమైన ప్రాకృతిక సంపద దాగి ఉంది.
హైడ్రా కమిషనర్ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
దేశంలో కరెన్సీ వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భార్య ప్రాణాలు పోతుంటే వీడియో కాల్‌లో చూపించిన కసాయి భర్త..!
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని వినతి..!
జింబాబ్వేపై 3-0తో సాధించిన క్లీన్ స్వీప్ భారత క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ లాంటి డెబ్యూటెంట్లలో కాన్ఫిడెన్స్ నింపి, వారి నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టిన వెరీ వెరీ స్పెషల్ వీవీవీఎస్ లక్ష్మణ్ ప్రశాంతత, విజన్ క్రికెట్ అభిమానుల మనస్సులను హత్తుకుంది.
ఆధార్ కోసం తిరిగి తిరిగి ఆలసి.. కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం..!
కిరాణా దుకాణం నడుపుతూ బయటకు సాధారణ వ్యాపారిలా కనిపించిన ఇద్దరు వ్యక్తులు
అమెరికా కలలతో సుదూర తీరాలకు వెళ్లిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్న ట్రైనీ ఐపీఎస్..!
కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు 32వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ వై. లక్ష్మణరావు నేతృత్వంలోని న్యాయస్థానం విచారణ జరిపి.. తమ్మినేని కుమారుడిపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని పేర్కొంటూ ముందస్తు బెయిలు నిరాకరించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీ లకు మాత్రం ముందస్తు బెయిల్ మంజూరుర చేసింది.
ఒకవైపు మంచినీటి కొరతతో జనం అల్లల్లాడుతుంటే.. మరోవైపు పది రోజులుగా నీరు వృధాగా పారుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. శివారెడ్డి పల్లి గేట్ ప్రాంతంలో పైప్‌లైన్ లీకేజీ కారణంగా గ్రామంలోని పలు కాలనీ వాసులకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం మహిళలు, గ్రామస్థులు కిలోమీటర్ల కొద్దీ దూరంలో ఉన్న వ్యవసాయ బావులు, బోర్‌వెళ్ల వద్దకు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.