Forest Bathing- ఆరోగ్యంలో కొత్త సంచలనం!

Publish Date:May 26, 2016

Advertisement

 

అడవి గాలి అన్న మాట మనకి కొత్తేమీ కాదు. కానీ ఆ గాలికి దూరం కావడమే ఓ చిత్రం. మనిషి నాగరికతకి నిదానంగా అలవాటుపడుతున్న కొద్దీ, ప్రకృతికి వీలైనంత దూరంగా జరుగుతున్నాడనడంలో అతిశయోక్తి ఏదీ లేదు. కానీ అలా నాగరిక ప్రపంచంలో మునిగిపోయిన ఉన్న మనిషి ప్రశాంతంగా ఉన్నాడా అంటే అదీ లేదు. ఒత్తిడి- ఒత్తిడి నుంచి రక్తపోటు- రక్తపోటు నుంచి గుండెజబ్బులు... ఇలా నానారకాల వ్యాధులూ అతన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఆ మధ్య ఎప్పుడో అమెరికాలో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఆ దేశంలోని జనం 87 శాతం సమయాన్ని నాలుగ్గోడల మధ్యే గడిపేస్తున్నారట. ఇలా నాలుగ్గోడల మధ్య నలిగిపోతున్న మనుషుల కోసం ఇప్పుడు ఓ కొత్త చికిత్సా విధానం ప్రచారంలోకి వస్తోంది. అదే Shinrin-yoku... అంటే జపాను భాషలో అడవీ స్నానం (ఫారెస్ట్‌ బాతింగ్‌) అన్నమాట!

 

Shinrin- Yoku ఎక్కడో ప్రాచీన కాలం నాటి పదం కాదు. అసలు అప్పట్లో ఇలాంటి అవసరమే లేదు కదా! 1980ల్లో జపాను అటవీ శాఖ మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. ఇదే క్రమంగా ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తోంది. ఇలా అడవీ స్నానం చేయాలనుకునే వ్యక్తులను, అందులో నిష్ణాతులైనవారు అడవుల్లోకి తీసుకువెళతారు. కేవలం అడవుల్లోకి అలా నడుస్తూ వెళ్లడమే కాదు... తమ చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ, చెట్టూచేమల్ని గమనిస్తూ సాగాలి. నిదానంగా ఊపిరిని పీల్చుకుంటూ, అడవిలో లీనమవుతూ నడవాలి. ఇలా ప్రయాణం సాగిస్తున్నప్పుడు తాము కూడా ఈ అనంతమైన ప్రకృతిలో భాగమే కదా అనిపిస్తుంది మనిషికి. ప్రకృతిలో ఉన్న జీవమే తనలోనూ తొణికిసలాడుతున్నట్లు తోస్తుంది. ఒత్తిడి స్థానంలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది.

 

Shinrin- Yoku వల్ల ఒత్తిడి మాయమైపోతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి తోడు మెదడు చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుందని తేలింది. ఒత్తిడిని కలిగించే కార్టిజాల్‌, అడ్రినలిన్‌ వంటి హార్మోలన్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడాన్ని కూడా గమనించారు. ఇక అడవిలో Shinrin- Yoku తరహా చికిత్సను తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి కూడా పెరిగినట్లు తేలింది. అందుకని ఇప్పుడు కొరియా మొదలుకొని ఆస్ట్రేలియా వరకూ దేశదేశాలన్నింటిలోనూ Shinrin- Yoku శిబిరాలు వెలుస్తున్నాయి. కానీ మనకు ఇలాంటి చికిత్స గురించి తెలియకుండానే మనం దానిని పాటించేస్తూ ఉన్నాము. ఏ తిరుపతికో, మేడారానికో, శ్రీశైలానికో... వెళ్తే Shinrin- Yoku శిబిరంలో పాల్గొన్నట్లే కదా! అక్కడ ఉండే అడవులూ, జలపాతాలూ, కొండకోనలూ అన్నీ మనలోని ప్రకృతిని తట్టిలేపేవేనయ్యే! కాకపోతే ఈసారి కాస్త మనసు పెట్టి వాటిలో లీనమైతే సరి... మనం కూడా అడవీ స్నానాన్ని ఆచరించినట్లే!

- నిర్జర.

By
en-us Political News

  
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.