Publish Date:Jul 14, 2025
లోకేష్ కి పథకాలు తయారు చేయడం రాదా? మరి స్టాన్ ఫర్డ్ లో ఏం నేర్చుకున్నట్టు? అమ్మకు వందనం విషయంలో వైసీపీ చేస్తున్న ప్రచారంలో అర్ధమేంటని చూస్తే.. ఫస్ట్ మనమంతా తెలుసుకోవల్సిన విషయమేంటంటే.. వాలంటీర్ వ్యవస్థ, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీముల ఆలోచనలు లోకేష్ వే అని ఎందరికి తెలుసు? వీటినే జగన్ కాపీ కొట్టాడన్న సంగతి మీకు తెలుసా?
ఎవరు అవునన్నా కాదన్నా.. లోకేష్ తండ్రి చాటు కొడుకు. ఆయన ఆలోచనలు నేరుగా ఏవీ అమలు కానివ్వని అతి పెద్ద అడ్డంకి తన తండ్రే. తానేదైనా ఒక ప్రతిపాదన చేస్తే.. దాన్ని అలవోకగా మరో స్టైల్లోకి మార్చేస్తారు లోకేష్ తండ్రి చంద్రబాబు. కార్యకర్తలకు జీతాలన్నదే వాలంటీర్లుగా జగన్ మార్చగా.. దాన్ని గతంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలుగా మారిన విషయం గుర్తించిన వారు అరుదుగా ఉంటారు. ఇక డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీములు కూడా లోకేష్ తొలుత చేసిన ప్రతిపాదన.
ఇక వైయస్ జగన్ పథక రచన సొంతంగా చేసేది ఏమీ ఉండదు. దీని వెనక అతి పెద్ద క్రిష్టియన్ లాబీ ఉంటుందని సమాచారం. జగన్ పైకి తన బొమ్మలేసుకుని.. ఇష్టారాజ్యం చేస్తుంటారు. కానీ, అదంతా ఒట్టిదే.. ఊరూరా ఉండే పాస్టర్లు.. ఈ పథకాలకు సంబంధించిన సమాచారమిచ్చి.. తగిన సూచనలు చేస్తుంటారు. వీటి ద్వారా జగన్ అయిన దానికీ కాని దానికి, అర్ధం పర్ధం లేని పథకాలు రచించేవారని అంటారు.
అలాగని ఈ కాపీ పేస్ట్ పథకాలు ఆయనకి ఏమంత కలిసొచ్చిన పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున ఎడా పెడా పథకాలిచ్చినా సరే ఆయన గెలవలేక పోయారు. అంటే ఆయన ఈ పథకాలను ఏమంత బాధ్యత కొద్దీ తయారు చేసినవి కావు. ఒక ఆలోచనతో చేసినవి కూడా కావు. అసలు జగన్ పథకాలంటే.. ఖర్చు భారం కింద లెక్క. పైపెచ్చు ఓట్ల కొనుగోలు వ్యవహారంగానూ భావిస్తుంటారు. అందుకే ఆయన గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని అంచనా వేస్తుంటారు నిపుణులు.. నిజానికి ఈ సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్. అప్పటి నుంచే ప్రజారంజక పథకాల శకం ఒకటి మొదలైంది. వాటినే ఆ తర్వాత వైయస్ కాపీ కొట్టారు. ఆ తర్వాత కేసీఆర్ సైతం పేస్ట్ చేసేశారు. ఇక జగన్ సంగతి సరే సరి. తన విస్తృ పథకాల తయారీలో అధిక శాతం.. క్రిష్టియన్ లాబీ నుంచి వచ్చిన సలహా సూచనలకు తన సొంత తయారీలా కలరింగ్ ఇచ్చి.. జనాల్లోకి వదిలేస్తుంటారని అంటారు.
నిజానికి ఒక పథకం అంటే అది ప్రభుత్వానికి భారం కారాదు. పెట్టుబడిగా ఉండాలి. అదెలాగో తెలియాలంటే మనకు చంద్రబాబు నూతన సృష్టి పీ- 4. ఇది నిజంగా ఒక అద్భుతమైన పథకం. ఇదే జగన్ తన హయాంలో అర్ధం పర్ధం లేకుండా చేసిన ఖర్చు ఆయన స్వార్ధానికి సంబంధించిన వ్యవహారం. ఈ మొత్తం పెట్టుబడి కింద పెట్టి మంచి రాజధాని నిర్మాణం చేసి ఉంటే.. అది ఈ పాటికి ఎన్నో పనులను సృష్టించి ఉండేది. ఈ విషయం గుర్తించారు కాబట్టే.. జనం ఆయన్ను తిప్పి కొట్టారు.అలాంటి జగన్ ఆయన పార్టీ లోకేష్ తమ అమ్మ ఒడినే కాపీ కొట్టి అమ్మకు వందనంగా పేరు మార్చారని చెప్పుకోవడం చూస్తుంటే వింతగా ఉందని అంటారు విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-cm-chandrababu-25-201993.html
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
Publish Date:Dec 31, 2025
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.