కళ, కార్టూన్‌కు ప్రోత్సాహమే సమాజ బాధ్యత : కేటీఆర్

Publish Date:Jul 19, 2026

Advertisement

 

ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అవార్డులు అందజేశారు. కార్టూన్ విభాగంలో కార్టూనిస్ట్ ఎం. నారు, ఆర్టిస్టు విభాగంలో చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్ పురస్కారాలు అందుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాజకీయ జీవితంలో నిత్యం విమర్శలు, ప్రతి విమర్శల మధ్య కొనసాగే తమకు ఇలాంటి సాహిత్య, కళా వేదికల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. కళాకారులు, రచయితలు, కవులు, చిత్రకారులతో మమేకమయ్యే అవకాశాలు అరుదుగా వస్తాయని, అలాంటి సందర్భాలు ఉద్యమ స్ఫూర్తిని, పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయని చెప్పారు.

కార్టూనిస్టుల పాత్ర గురించి ప్రస్తావిస్తూ... "ఒక చిత్రం వెయ్యి పదాలకు సమానం" అనే సూక్తిని ఉటంకించారు. సమాజం, రాజకీయాలపై కార్టూన్ల ప్రభావం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. భారతదేశంలో ఆర్.కే. లక్ష్మణ్ వంటి మహోన్నత కార్టూనిస్టులు చూపిన మార్గం చిరస్మరణీయమని, అంతర్జాతీయంగా బిల్ వాటర్సన్ సృష్టించిన క్యాల్విన్ అండ్ హాబ్స్ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.

తెలుగులో ఈనాడు శ్రీధర్, సాక్షి శంకర్ వంటి కార్టూనిస్టుల ప్రతిభను కేటీఆర్ ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహాత్మా గాంధీ విలువలు, ఆయన చూపిన సిద్ధాంతాల అవసరం దేశానికి మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. మత విశ్వాసాలు ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనవేనని, పరస్పర గౌరవంతో ముందుకు సాగడం సమాజానికి అవసరమని అన్నారు.

జీవితంలో గెలుపు, ఓటములు సహజమని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయడమే ప్రజాప్రతినిధుల కర్తవ్యమని కేటీఆర్ పేర్కొన్నారు. కళను ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు అవసరమని, ప్రతిభావంతులైన యువ కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని అన్నారు. శేఖర్ కుటుంబ సభ్యులు, మిత్రులు గత ఆరేళ్లుగా ఆయన స్మారకార్థం ఈ అవార్డులను నిర్వహిస్తూ కార్టూన్, చిత్రకళ రంగాల్లో విశిష్ట సేవలందించిన కళాకారులను సత్కరిస్తుండటాన్ని కేటీఆర్ అభినందించారు.

 cartoonist Shekhar, Somajiguda,Press Club, Shekhar Memorial Awards, KTR, Painter Kurella Srinivas  

By
en-us Political News

  
సీజేపీ చలో పార్లమెంట్ ఉద్రిక్తం, పోలీసుల ఆంక్షలు..!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి సస్పెండ్..!
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది.
విచారణ కమిటీ నివేదిక వేళ ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యకు యత్నం..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరో కీలక దశకు చేరుకుంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది.
ఫుట్‌బాల్ సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు తన అద్భుతమైన ఆటతీరుతో శాసించిన లెజెండరీ ఆటగాడు లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్ తీవ్ర నిరాశతో ముగిసింది.
నేటి సోషల్ మీడియా యుగంలో క్షణాల్లోనే ఫేమస్ కావాలనే మోజు యువతను ప్రమాదకర మార్గాల వైపు నెడుతోంది.
ప్రపంచ ఫుట్‌బాల్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌లో స్పెయిన్ జట్టు సంచలన విజయంతో విశ్వవిజేతగా నిలిచింది
కానిస్టేబుల్ నుండి ఐపీఎస్‌..అయిన తీరు మారలేదు..!
రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్..!
సిదిరి అప్పలరాజు కుమారుడు .. ఆరవ్ వర్మ కు కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, ఎస్సై సునీల్ కూడా అండగా నిలిచారని వెల్లడైంది. అరవ్ హిట్ అండ్ రన్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది.
సాధారణంగా దూకుడుగా ఆడే రోహిత్, ఈ మ్యాచ్‌లో ఆరంభంలో ఆచితూచి ఆడాడు. ఒకింత నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. లూజ్ బాల్ వచ్చే వరకూ వెయిట్ చేశాడు. స్టాల్ సెలక్షన్ కూడా సెలక్టివ్ గా ఉంది. లూజ్ బాల్స్ ను బౌండరీకి తరలిస్తూ.. మంచి బంతులకు గౌరవం ఇస్తూ ఇన్నింగ్స్ నిర్మించాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.