ఆ పదిమందికీ బీఆర్ఎస్ తలుపులు తెరిచే ఉన్నాయా?

Publish Date:Apr 26, 2025

Advertisement

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగతున్న వేళ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల పునరాగమనం గురించి ఆసక్తికర  చర్చ జరుగుతోంది.  నిజానికి నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీ రామరావు చాలా స్పష్టంగా ఆ పది మందిలో ఏ ఒక్కరినీ వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని ఖరాఖండిగా చెపుతూ వచ్చారు. అయితే.. తాజాగా కేటీఆర్ అది తన వ్యక్తిగత అభిప్రాయమనీ,  అలాంటి  అతి ముఖ్యమైన విషయంలో పార్టీ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.

 అంటే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లు అయిందని అంటున్నారు. నిజానికి.. చాలా కాలంగా కేటీఆర్ పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ తలుపులు శాశ్వతంగా ముసుకు పోయాయనీ.. మళ్ళీ వస్తామని వేడుకున్నా, ప్రాధేయ పడినా  బీఆర్ఎస్ తలుపులు మళ్ళీ తెరుచుకోవని అడిగినా,  అడగక పోయిా అందరికీ చెపుతూ వచ్చారు. ఆ పది మందిని మళ్ళీ పార్టీలోకి రానిచ్చేది లేదని ఒకసారి కాదు..  ఒక భాషలో, ఒక ఇంటర్వ్యూలో కాదు ప్రతి ఇంటర్వ్యూలో అదే మాట చెపుతూ వచ్చారు. అలాగే ఆ పది నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, చెప్పారు.  

అలాగే.. పార్టీ ఫిరాయించినఎమ్మెల్యేలు భయపడవలసిన అవసరం లేదని, ఉప ఎన్నికలు రావంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను కేటీఆర్  ప్రతి ఇంటర్వ్యూలోనూ  తప్పు పట్టారు.  సుప్రీం కోర్టు విచారణలో ఉన్న అంశంపై  ముఖ్యమంత్రి సభలో మాట్లాడదాన్ని కూడా తప్పు పట్టారు.సుప్రీం కోర్టు కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టిందని అన్నారు. ఆ పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవని కటీఆర్ చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని, ఒకటికి  పదిసార్లు చెప్పారు. అంతే కాదు, పార్టీ నాయకులు కార్యకర్తల సెంటిమెంట్స్ ను గౌరవించాలని అన్నారు. కొత్త నాయకత్వాన్ని పోటీకి సిద్దం చేస్తున్నామని చెప్పారు. మరోవంక,ఆ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ.. కేటీఆర్ మరి కొందరు  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు విచారణ పూర్తి చేసింది. తీర్పును వాయిదా వేసింది. ఈ నేపధ్యంలోనే కేటీఆర్  ఉప ఎన్నికలు తధ్యమని చెపుతూ వచ్చారు. 
అయితే, ఇప్పడు అదే కేటీఆర్  పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకోరాదనేది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అంటూ.. తుది నిర్ణయం తీసుకోవలసింది పార్టీనే అంటూ.. కొత్త పాట, కొత్త పల్లవి ఎత్తుకున్నారు. 

ఈ నేపధ్యంలోనే కేటీఆర్  మాటల్లో ఈ మార్పు ఎందుకొచ్చింది అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందని అంటున్నారు. అది కూడా, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ముందు కేటీఆర్ టోన్ ఎందుకు మారింది? రజతోత్సవ సభ వేదికగా, ఎవరైనా స్వగృహ ప్రవేశం చేస్తారా? అందుకే కేటీఆర్, మాట మారిందా? అనే చర్చ జరుగుతోందని అంటున్నారు.అయినా,  పార్టీలు ఫిరాయించడం ఎలాగో, మాట మార్చడం కూడా రాజకీయాల్లో  మాములే..  అందుకే ఏనాడో కన్యాశుల్కం, గిరీశం ఒపీనియన్స్ మార్చుకోలేని వాడు పొలిటీషియన్ కాలేరని అన్నారని అంటున్నారు. సో... ఇతర విషయాలు ఎలా ఉన్నా... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్ళీ  గులాబీ గూటికి రావాలనుకుంటే రావచ్చును.అన్ని తలుపులు అన్ని వైపులా తెరిచే ఉన్నాయి.. అంటున్నారు.

By
en-us Political News

  
ఏపీ సీఎం చంద్రబాబు రేపు చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి దర్శించుకుంటారు.
జగన్ అడ్డా కడపలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 19 వరకూ జరిగే పసుపు పండుగ మహానాడు నిర్వహణ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఆందోళన రేపుతున్నాయి. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు.
బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో వంశీని రెండు రోజుల కస్టడీకి ఇవ్వాలని హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టుకు కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు. యూనివర్శిటీలో జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పెంచిన ప్రయాణ ఛార్జీలను సవరించింది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ, వాటిని 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్నాది.
నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో బుధ, గురువారాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఓవంక సుపరిపాలన ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూనే, మరో వంక పార్టీ పటిష్టతపై దృషి కేంద్రీకరించారు. గతంలో అధికారంలో ఉన్న ఐదేళ్లలో.. అప్పటి పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్ర విభజన విసిరిన సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునే క్రమంలో .. చంద్రబాబు, స్టేట్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ నినాదంతో శక్తి యుక్తులు అన్నింటినీ రాష్ట్ర ప్రయోజనాలకే వెచ్చించారు.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు భారీ షాక్ తగిలింది. గులాబీ బాస్‌తో పాటు పాటు మాజీమంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆదేశాలు జారీ అయ్యాయి.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, ఈ కేసులో ఏ1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఈ నలుగురినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ ఆ పిటిషన్ లో పేర్కొంది.
హైదరాబాద్‌ పాతబస్తీ గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది మృత్యువాత పడిన విషాద ఘటన కలకలం రేపింది. అగ్నిప్రమాద కారణాలపై సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.