అంతర్వేది వద్ద సముద్రం వెనక్కి.. సంకేతమేంటి?

Publish Date:Sep 30, 2025

Advertisement

కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అనూహ్యంగా 500 మీటర్ల మేర వెనక్కు తగ్గింది. సోమవారం (సెప్టెంబర్ 29)న ఒక్కసారిగా సముద్రం వెనక్కు వెళ్లడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నిత్యం ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతూ ఉండే అంతర్వేది తీరంలో సముద్రం వెనక్కు తగ్గడం దేనికి సందేశం అన్న చర్చ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.    సముద్రం దాదాపు అరకిలోమిటరు మేర వెనక్కు వెళ్లడం పట్ల   మత్స్యకారులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సునామీ వంటి ప్రకృతి విపత్తు ముందు సముద్రం ఇలా వెనక్కి వెడుతుందని అంటున్నారు.

 సముద్రం గోదావరి కలిసే సంగమ స్థలంగా అంతర్వేది ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. అంతర్వేదిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని మహిమాన్విత దేవుడిగా భక్తులు కొలుస్తుంటారు. అలాగే అంతర్వేది తీరం, సంగమ ప్రాంతం కూడా కావడంతో ఇక్కడికి పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అటువంటి అంతర్వేదిలో సముద్రం వెనక్కు వెళ్లి మట్టి మేటలు వేసింది. సాధారణంగా సముద్రం వెనక్కు వెళ్లినప్పుడు ఇసుక మేటలు ఏర్పడతాయనీ, అయితే అసాధారణంగా మట్టిమేటలు ఏర్పడటం భయంగొల్పుతోందనీ స్థానికులు చెబుతున్నారు.  ఆటు సమయంలో సముద్రం వెనక్కు వెళ్లడం సర్వసాధారణమే అయినా ఇంతగా అంటే అరకిలోమీటరకు పైగా వెనక్కు వెళ్లడం అన్నది ఇదే తొలిసారని అంటున్నారు.   

కాగా అంతర్వేది వద్ద సముద్రం వెనక్కు వెళ్లడంపై స్పందించిన అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.  టెక్నాలజీ అప్లికేషన్ ఫర్ వెదర్ మానిటరింగ్)  జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా  బృందాలు ఇక్కడకు చేరుకుని పరిశీలిస్తున్నాయి.  

By
en-us Political News

  
కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న అమరావతిని కవిత వరద ప్రాంతమంటూ ఎద్దేవా చేయడాన్ని తప్పుపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు గురువారం ఉదయం నుంచే విస్తృతంగా సోదాలు చేపట్టాయి. రాజ్‌ కేసిరెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలే లక్ష్యంగా జరిగిన ఈ సోదాలలో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లను భారతదేశంలో సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా ఎలా చూడాలో తెలుసుకోండి. డీడీ స్పోర్ట్స్ ఉచిత లైవ్ స్ట్రీమింగ్ షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు మీకోసం.
జూన్ 11న దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్‌లో 100 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 75,200 తగ్గింది. అమెరికా డాలర్ బలోపేతం, గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో తాజా 22k, 24k లైవ్ గోల్డ్ రేట్లు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని రిస్టాడ్ ఎనర్జీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
శాఖ స్టీల్ ప్లాంట్ లోని ఎస్‌ఎమ్‌ఎస్-1 విభాగంలోని ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్ వద్ద లాడిల్ నుండి ద్రవ ఉక్కు ఒక్కసారిగా లీకైంది. అయితే.. ఈ లీకేజీ జరిగిన సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
నేటి డిజిటల్ కాలంలో యూపీఐ స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్ మరియు స్క్రీన్ షేరింగ్ మోసాల నుండి మీ బ్యాంక్ అకౌంట్‌ను ఎలా కాపాడుకోవాలో, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 వివరాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
కాక్రోచ్ జనతాపార్టీ విడుదల చేసిన ఒక ప్రకనటలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దేశ యువత అంటే జన్ జీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డానికి భ‌య‌ప‌డ‌టం లేద‌ని పేర్కొంది. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ తో గురువారం (జూన్ 11) పూణేలో ఆందోళ‌న చేప‌ట్టింది. ఆ త‌రువాత ల‌క్నో, అమృత్‌స‌ర్‌, బెంగ‌ళూరు, జైపూర్‌, హైద‌రాబాద్‌లో కూడా ఆందోళ‌న‌లు నిర్వహిస్తామనీ, ఈ నెల 13లోగా కేంద్ర మంత్రి రాజీనామా చేయ‌క‌పోతే జూన్ 20న జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌వ‌ధిక ధ‌ర్నా చేప‌డ‌తామ‌ని పేర్కొంది.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరియు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోగా, ఐటీ రంగ షేర్లు 2 శాతానికి పైగా పతనమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ బ్యాంకింగ్ రంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు యూపీఐ మోసాల వల్ల ఎదురవుతున్న తీవ్ర నష్టాలు మరియు సైబర్ ముప్పుల గురించి బయోక్యాచ్ (BioCatch) తాజా నివేదిక వెల్లడించిన షాకింగ్ గణాంకాలు మీకోసం.
బెంగళూరు నమ్మ మెట్రో ఫేజ్-3 డబుల్ డెక్కర్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి లైన్ క్లియర్ అయింది. రూ.9700 కోట్ల అదనపు వ్యయంతో ఒకే పిల్లర్‌పై నిర్మించే ఫ్లైఓవర్, మెట్రో రూట్ మ్యాప్ మరియు 32 మీటర్ల ఎత్తైన స్టేషన్ వివరాలు ఇక్కడ చూడండి.
మమఎర్త్ మాతృసంస్థ హోనాసా కన్స్యూమర్ ఆర్థిక సంవత్సరం 2031 నాటికి రూ.5,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రకటించడంతో షేర్లు 6% పైగా పెరిగాయి. ఈ స్టాక్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఇచ్చిన తాజా రేటింగ్ మరియు పూర్తి వివరాలు మీకోసం.
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యంగ్ షట్లర్ తన్వీ శర్మ సంచలన విజయం సాధించింది. ఐదో సీడ్ చియు పిన్ చైన్ పై అద్భుత పోరాటంతో గెలిచింది. పీవీ సింధు, మాళవిక కూడా తదుపరి రౌండ్ కు దూసుకెళ్లారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.