పెను ప్రమాదంలో బీజేపీ.. హెచ్చరించిన వైసీపీ ఎంపీ

నిత్యం టీడీపీ నేత చంద్రబాబు, లోకేష్ ల పై తన ట్వీట్ల ద్వారా విరుచుకు పడే వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా మరో సారి టీడీపీ నేతల ను తీవ్రంగా విమర్శిస్తూ బీజేపీ కి జాగ్రత్తలు చెప్పారు. బీజేపీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఒక వైపు కరోనా, మరో వైపు చైనా తో ఘర్షణ, మిడతల దండు యొక్క దాడి పై దృష్టి పెట్టి పని చేస్తోంది. ఐతే ప్రస్తుతం బీజేపీ కి మరో వైవు నుండి ప్రమాదం పొంచివుందని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి తన తాజా ట్వీట్ ద్వారా హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారాన్ని కొల్పోయిన టిడిపి మిడతల దండు తాజాగా బిజెపి వైపు కదులుతోందని, అంతేకాకుండా ఇప్పటికే బిజెపిలో చేరిన ఆ దండు తన విధ్వంసాన్ని ప్రారంభించదని అయన పేర్కొన్నారు. ఈ ప్రమాదం నుండి బిజెపి ఎలా బయటపడుతుందో వేచి చూడాలని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

గడచిన సంవత్సర కాలంగా తినడానికి ఏమీ దొరక్క నక నక లాడుతున్నఈ టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోందాని అన్నారు. ఇప్పటికే కొన్ని మిడతలు బీజేపీ లో చేరి విధ్వంసం సృష్టిస్తున్న సంగతి గ్రహించేలోగానే మిగతావి కూడా ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బిజెపి ఎలా బయటపడుతుందో చూడాలి అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. తమ స్వార్థం కోసం జెండాలు మార్చేవారంతా లిటిగెంట్ల అవతారం ఎత్తుతున్నారని, అలాగే ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదని, ఇప్పటికే పతనమైన విలువలకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్న జగన్ గారిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవని అయన ట్వీట్ చేసారు. ఈ నాయకులంతా కేవలం మీడియా ఎంటర్ టెయినర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదు అని ఎంపీ విజయసాయి రెడ్డి వారి పై మండిపడ్డారు.

విశాఖలో ఒక పబ్లిక్ పార్క్ ఆక్రమించుకున్న విశాఖ గల్లీ స్థాయి నాయకుడు ఒకరు ఎన్నికలకు ముందు జగన్ గారు అసలు అధికారంలోకి రానే రారన్నాడు. అదే విషయాన్ని అప్పట్లో పచ్చ మీడియాలో డిబేట్లతో ఊదరగొట్టి.. ఇప్పుడు తాజాగా సీఎం పూర్తికాలం అధికారంలో ఉండరంటున్నాడు. ఈ చంద్రబాబు తొత్తుల ప్రీపెయిడ్ సిమ్స్ కి రీఛార్జ్ చేయడం ఆపేస్తే నోళ్లు మూగబోతాయి అంటూ విజయసాయి ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.