ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా

ఏపీలో ఈనెల 8వ తేదీన జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా 8వ తేదీన ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గక పోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.