టీడీపీ రూ.20 కోట్ల భూమి ఆఫర్ చేసింది.. వైసీపీ ఎమ్మెల్యే

 

వైసీపీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి టీటీడీపీలోకి చేరుతున్న వేళ మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ పై సంచలనమైన ఆరోపణలు చేశారు. విశాఖపట్టణం జిల్లాలోని మాడుగుల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ..  తనను టీడీపీ పార్టీలోకి చేర్చుకునేందుకు గాను సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించారని.. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని.. రూ.20 కోట్లు, రాజధానిలో భూమి ఇచ్చేందుకు తనకు ఎర చూపారని ఆరోపించారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లను కలిసే ఏర్పాటు చేస్తానని సీఎం రమేష్ తనతో అన్నారని, అయితే, ఈ ఆఫర్ ను తాను తిరస్కరించానని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu