ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిపోయి 17 మంది మృతి

 

కెన్యాలో భారీ తుఫాను సంభివించింది. ఈ తుఫాను వల్ల 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం కెన్యా రాజధాని నైరోబీలో తుఫాను సంభవించడం వల్ల కుండపోత వర్షాలకు ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిపోయి 17 మంది మరణించడంతో పాటు 121 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. అలాగే వరదలు, భవనాలు కూలడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వారు చెప్పారు. కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా ఘటనా స్థలిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిథిలాల నుంచి పది మృతదేహాలు వెలికితీశామని, 80 మందికి చికిత్స అందించి డిశ్చార్జి చేసినట్లు వెల్లడించారు.