కేజ్రీ ప్లాన్ ఫ్లాప్ అయిందా.. 23 శాతం కాలుష్యం పెరిగింది

 

ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈమధ్యే మలి దశను ప్రారంభించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ పద్దతి సత్ఫలితాన్ని ఇవ్వలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. బ్రీత్ ఎయిర్ క్వాలిటీ గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ నాటికి కాలుష్యం 23 శాతం పెరిగిపోయిందట. తొలి రెండు వారాల్లో ఘనపు మీటర్ పరిధిలో 56.17 మైక్రోగ్రాముల కాలుష్య కారకాలుండగా, సరి-బేసి విధానం ముగిసేనాటికి అది 68.98 మిల్లీగ్రాములకు పెరిగిందట. దీంతో బస్ సర్వీసులను పెంచడం, పరిశ్రమలకు అడ్డుకట్ట, కాలుష్య కారకాలను వెదజల్లే వాహనాల అదుపు వంటి అదనపు చర్యలు తీసుకోకుంటే, దీర్ఘకాలంలో సరి-బేసి విధానం పని చేయదని వెల్లడైనట్లయింది. మరి దీనికి కేజ్రీవాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.