మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...

 

వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బెంగళూరు రుణ రికవరీ ట్రిబ్యునల్ బెంచ్ తాజా తీర్పుతో  మాల్యాకు మరిన్ని  ఇబ్బందులు తప్పేలా లేవు. మాల్యా నుంచి రుణాన్ని వసూలు చేసుకునే అవకాశం ఇవ్వాలని బ్యాంకుల కన్సార్టియం పిటిషన్‌ను విచారించింది. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యాకు చెందిన పలు ప్రాంతాల్లో ఆస్తుల వేలానికి డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu