వందేభారత్ రైళ్లలో 15 నిముషాల ముందు కూడా రిజర్వేషన్

 

వందే భారత్‌ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్‌ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు నడుపుతున్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆ క్రమంలో వందే భారత్‌ రైలు బయల్దేరే  పావుగంట ముందు కూడా  రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు.  

ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా రైలు బయల్దేరే 15 నిమిషాలకు ముందు ఖాళీ సీట్ల వివరాలు తెలుపుతామని, ఆ సీట్లు ప్రయాణికు లు రిజర్వేషన్‌ చేసుకోవచ్చను ఈ సౌకర్యం మంగళూరు సెంట్రల్‌-తిరువనంతపురం (నెం.20631), తిరువనంతపురం-మంగళూరుసెంట్రల్‌(నెం.20632), చెన్నై - ఎగ్మూర్‌- నాగర్‌కోయిల్‌(నెం.20627), నాగర్‌కోయిల్‌-చెన్నై ఎగ్మూర్‌ (నెం.20628), కోయంబత్తూర్‌-బెంగళూరు కంటోన్మెంట్‌ (నెం.20642), చెన్నై సెంట్రల్‌-విజయవాడ , మంగళూరు సెంట్రల్‌-మడగావ్‌ (నెం.20646), మదురై-బెంగళూరు కంటోన్మెంట్‌ (నెం.20671) తదితర 8 వందే భారత్‌ రైళ్లకు కల్పించినట్లు అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu