టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా... వర్షాలని...

 

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని అట్టహాసంగా నిర్వహించాలని అనుకున్న ఆ పార్టీ నేతలు వెనక్కి తగ్గారు. దీనికి కారణం వర్షాలు అని చెబుతున్నారు. వర్షాల కారణంగా తెరాస ప్లీనరీ, బహిరంగసభలను వాయిదా వేసినట్టు టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ చెప్పారు. ఈనెల 18వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ, 19వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగసభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వర్షాల రాబోతున్న కారణంగా ఎవరికీ ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను వాయిదా వేశామని ఆయన వివరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu