మహారాష్ట్ర సరే.. పాకిస్థాన్ సంగతేంటి?

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ, శివసేన మధ్య పొత్తు చిత్తు అయిన తర్వాత శివసేన నాయకులు ప్రధాని మోడీ మీద ఫైర్ అవుతున్నారు. మహారాష్ట్రను ఎవరూ విడదీయలేరని మోడీ చేసిన ప్రకటనకు శివసేన నాయకులు ప్రతిస్పందించారు. ప్రధాన మంత్రి నరంద్ర మోడీ మహారాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ముందు పాకిస్థాన్‌తో సరిహద్దు సమస్యలపై దృష్టి పెట్టాలని శివసేన సూచించింది. పాక్ కాల్పుల్లో పౌరులు కూడా చనిపోవడం దురదృష్టకరమని, ఆ విషయాన్ని మోడీ తన ఎన్నికల ప్రసంగాల్లోనూ, అటు, తన ట్వీట్లలోనూ ప్రస్తావించడంలేదని సేన మండిపడింది. ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu