మెట్రోపై టీ సీఎం కార్యాలయం ప్రకటన

 

మెట్రో రైలు నిర్మాణం నుంచి తప్పుకుంటామంటూ ఎల్ అండ్ టీ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం బయటపడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టకే భంగం ఏర్పడింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. మెట్రో రైలు నిర్మిస్తున్న ఎల్ అండ్ టీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాధారణమని ముఖ్యమంత్రి కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, తెలంగాణ ప్రజలకు నష్టం జరిగేలా పత్రికల్లో కథనాలు వస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu