తెలంగాణ కేబినెట్ భేటీ.. కొత్త రేషన్ కార్డులకు ఆమోదం తెలిపే అవకాశం!

తెలంగాణ కేబినెట్ భేటీ శనివారం (అక్టోబర్ 26) జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చింది ఆమెదం తెలిపే అవకాశం ఉందని అంటున్నారు.

అలాగే క్రీడా విధానంపై కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతే కాకుండా హైడ్రా, జీవో 317, ఉద్యోగుల డీఏ తదితల  అంశాలపై కూడా కేబినెట్ చర్చిస్తుంది. ఇఖ మూసీ పునరుజ్జీవ చర్యలపై కూడా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu