చీరాల ఎమ్మెల్యే.. టీడీపీ ఇంఛార్జ్.. కుర్చీలతో దాడి


 


ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలు ,చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈరోజు వికలాంగుల సదరన్ క్యాంపు కార్యక్రమంలో  టీడీపీ పార్టీ నేతలు.. ఆమంచి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు చీరాల తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి సునీతల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఘర్షణకు దారితీసింది. దీంతో టీడీపీ పార్టీ నేతలు, ఎమ్మెల్యే ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరి మీద ఒకరు కుర్చీలు విసురకొని పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి తెలుసుకొని ఇరువర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి చక్కబడింది.