జగన్ దీక్ష డేట్ ఖరారు



ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15న దీక్ష చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే 17 వ తేదీన వినాయక చవితి ఉన్న నేపథ్యంలో విరమించుకున్నారు. అయితే ఈరోజు వైయస్ జగన్ అన్ని జిల్లాల పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో దీక్ష తేదీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 26 నుండి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్లు.. పార్టీ నేతలతో చర్చించిన తర్వాతనే వైయస్ జగన్ ఈ తేదీని ఖరారు చేసినట్లు తెలిపారు.

ప్రత్యేక హోదా కోసం జగన్ ఇప్పటికే ఢిల్లీలో ధర్నా చేశారు. కొద్ది రోజుల క్రితమే విజయవాడలో కూడా ధర్నా చేశారు. ఇప్పుడు గుంటూరులో నిరహారదీక్ష. మరి జగన్ దీక్షలు ఎంతవరకూ పని చేస్తాయో చూద్దాం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu