నా కొడుకును కాపాడండి... దేవేందర్ గౌడ్
posted on May 14, 2015 4:37PM

నేపాల్ దేశంలో భూకంపం వచ్చి అక్కడి ప్రజలు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఎంతో ఆస్తి నష్టం కలిగింది. ఆ దేశానికి సాయం చేయడానికి భారత్ సహా ఎన్నో దేశాలు ముందుకొచ్చాయి. అలా వారికి సాయం చేయడానికి వెళ్లిన వారిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ కూడా ఉన్నాడు. అయితే మంగళవారం నేపాల్ లో మళ్లీ భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో కొండ చరియలు విరిగిపడటంతో వాటి నుండి జాగ్రత్తగానే తప్పించుకున్నారు కానీ అక్కడి నుండి ఎలా బయట పడాలో వాళ్లకు తెలియడం లేదట. దీంతో దేవేందర్ గౌడ్ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో భేటీ అయ్యారు. నేపాల్ లో చిక్కుకుపోయిన తన కొడుకు తోపాటు మరో 16 మంది బృందాన్ని సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర మంత్రులను కోరారు.