అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం.. చంద్రబాబు

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రకాశం జిల్లా దోర్నాలోని బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా విధానంలో రైతులు చితికిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా బాగా రెచ్చిపోయిందని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక మాఫియాను అరికట్టామని అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ. 500 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇంకొంతమంది రుణమాఫీ చేయడం అసాధ్యమన్నారని.. కానీ 24వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu