రోడ్డు ప్రమాదంలో జీజేపీ నేత మృతి
posted on May 14, 2015 5:28PM

పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో స్థానిక భాజపా నాయకుడు అసిత్ శంకర్ మృతి చెందారు. వివరాల ప్రకారం.. రాజ్ గంజ్ లోని తన పార్టీ కార్యలయం నుండి అసిత్ శంకర్ తిరిగి వస్తుండగా బెలకొడ వద్ద తన కారును ద్విచక్ర వాహనం ఢికొట్టింది. ఈ ప్రమాదంలో అసిత్ శంకర్ కు తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం అసిత్ శంకర్ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు రాజ్ గంజ్ రోడ్డు వద్ద ధర్నాకి దిగారు. రాజ్ గంజ్ ప్రాంతంలో ట్రాఫిక్ సరైన ట్రాఫిక్ నిబంధనలు లేనందుకు ఈ ప్రమాదం జరిగిందని, అక్కడ సరైన ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీడీవో ఎస్.పి షెర్బా వచ్చి నచ్చజెప్పడంతో వారి ఆందోళనలు విరమించారు.