తాజ్‌మహల్ వద్ద బుస్.. బుస్..పర్యాటకుల పరుగులు

ప్రేమకు నిలువెత్తు చిహ్నాం..ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద ఈ ఉదయం కలకలం రేగింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక పాము పర్యాటకులను బెంబెలేత్తించింది. ఎండ వేడిమికి తాళలేక నీటిలో సేదతీరదామని ఓ అరడుగుల పాము తాజ్‌మహల్‌లోని వాటర్ ప్లాంట్‌లో దాక్కుంది. ఇది గమనించిన పర్యాటకులు భయాందోళనకు గురై కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. అధికారులు జంతు సంరక్షణ కేంద్రానికి సమాచారం అందించడంతో వారు గంట పాటు శ్రమించి పామును పట్టుకున్నారు. దీంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకుని తాజ్ అందాలను వీక్షించే పనిలో పడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu