సుప్రీం తరువాత హైకోర్టు చేత మొట్టికాయలు

 

శెట్టి బలిజ కులస్తులకు రిజర్వేషన్ వర్తింపజేయనందుకు సుప్రీం కోర్టు నుండి నోటీసులు అందుకొన్న తెలంగాణా ప్రభుత్వం, తరువాత హైకోర్టు నుండి కూడా హెచ్చరికలతో కూడిన నోటీసులు అందుకొంది. పార్టీ నేతలకు ఉపాధి కల్పించేందుకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించి వారికి క్యాబినెట్ హోదా కల్పించడాన్ని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు నెలల క్రితం తెలంగాణా ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. కానీ తెలంగాణా ప్రభుత్వం కౌంటర్ వేయడంలో అశ్రద్ధ చూపడంతో హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మళ్ళీ వాయిదాలోగా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోతే ఈసారి ప్రభుత్వానికి జరిమానా విధించవలసి వస్తుందని హెచ్చరించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తరచుగా సుప్రీం కోర్టు, హైకోర్టుల చేత అక్షింతలు వేయించుకోవడం విచిత్రమే. బహుశః ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వం ఏదో ఒకరోజు గిన్నిస్ రికార్డుకి ఎక్కుతుందేమో!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu