అఫ్గాన్‌ ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతి

Suicide bomber kills 20 in Afghanistan, Suicide bomber kills 30, Suicide bomber  Afghanistan

 

బక్రీద్‌కు ముందు ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబుల్‌లో ఉగ్రవాదులు ఆత్మహుతి దాడి చేశారు. మజీద్‌లో ఈ దాడి జరగడంతో దాదాపు 30 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అఫ్గానిస్తాన్‌లోని ఫార్యాబ్ ప్రొవిన్స్‌లో గల మయ్మానా నగరంలో ఈ దాడి జరిగింది. సెలవుల సందర్భంగా భక్తులు ప్రార్థనలు చేయడానికి పెద్ద యెత్తున గుమికూడారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారని ప్రొవిన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి అహ్మద్ జావేద్ బైదర్ చెప్పారు. ఉగ్రవాది పోలీసు యూనిఫాంలో వచ్చి తనను పేల్చేసుకున్నాడని చెబుతున్నారు. ఈ దాడి వెనక తాలిబాన్ హస్తం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. భక్తులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఫర్యాబ్ పోలీసు చీఫ్ ఉగ్రవాదుల లక్ష్యమని తెలుస్తోంది. అయితే, ఆయన పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. పోలీసు చీఫ్ వాహనంలో ఎక్కుతుండా ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. భద్రతా బలగాలను లక్ష్యంగా కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu