ఓడిపోయాం.. ఒప్పుకుంటాం.. రాహుల్

 

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒప్పుకున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో తమ పార్టీ సుదీర్ఘంగా అధికారంలో వుందని అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారని రాహుల్ గాంధీ తమ ఓటమిని విశ్లేషించారు. మహారాష్ట్రలో పదిహేనేళ్ళు, హర్యానాలో పదేళ్ళు తమను నమ్మిన ప్రజలకు రాహుల్ గాంధీ థాంక్స్ చెబుతూ, రాబోయే రోజుల్లో వారి నమ్మకాన్ని మరోసారి గెలుచుకునే ప్రయత్నం చేస్తామని అన్నారు. ప్రజలు తమను ప్రతిపక్షంలో వుండాలంటూ ఆదేశించారు కాబట్టి, ఇకపై నిర్మాణాత్మక ప్రతిపక్షం పాత్రను పోషిస్తామని ఆయన తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu