తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టిన సోనియా గాంధీ

 

మేడ్చల్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభా వేదిక వద్దకు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ కాసేపట్లో చేరుకోనున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముందుగా వారు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అనంతరం బహిరంగ సభకు వెళ్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సోనియా గాంధీ మొదటిసారి రావడంతో.. సోనియా గాంధీ ఏం మాట్లాడతారా? అని పార్టీ శ్రేణులతో పాటు, ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీ సమక్షంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు ఎవరైనా టీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారా అనే ఆసక్తి నెలకొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu