తల్లిని చంపి సవాల్.. ‘నన్ను పట్టుకోండి.. ఉరితీయండి'
posted on May 26, 2017 1:18PM
షీనాబొరా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమెను కత్తితో పొడిచి మరీ చంపారు. అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులుకు దిమ్మతిరిగే విషయం బయటపడింది. ఆ హత్య చేసింది ఎవరో కాదు ఆమె కొడుకే. వివరాల ప్రకారం.. దీపాలిని ఆమె కొడుకు సిద్దాంత్ కత్తితో పొడిచి చంపాడు. అక్కడితో ఆగకుండా ఓ సవాల్ కూడా విసిరాడు ఆ కసాయి కొడుకు.. ఇంతకీ ఆ సవాల్ ఏంటనుకుంటున్నారా.. తన తల్లి మృతదేహం పక్కనే.. ‘నన్ను పట్టుకోండి.. ఉరితీయండి’ అంటూ రక్తంతో రాశాడు. ఘటన సమయం నుంచి ధ్యానేశ్వర్ 21ఏళ్ల కుమారుడు సిద్ధాంత్ కన్పించకుండా పోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు జోధ్పూర్లో సిద్ధాంత్ను పోలీసులు అరెస్ట్ చేయగా అసలు విషయం బయటపడింది. తన తల్లిని తానే హత్య చేశానని..ఆ అక్షరాలు రాసింది తనేనని చెప్పినట్టు పోలీసులు తెలిపారు.