ఐదుగురు మావోయిస్టులకు ఉరిశిక్ష..

 

బీహార్ లోని ముంగేర్ కోర్టు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.  జవాన్లను చంపినందుకు గాను ఐదుగురు మావోయిస్టులకు ఉరిశిక్ష వేసింది. వివరాల ప్రకారం.. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో ఏప్రిల్ 10 ముంగర్ జిల్లా గంగ్తాలోని జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్లను చంపారు. సీఆర్పీఎఫ్ జవాన్లు సొనే గౌడ, రబీంద్ర రాయ్ లు మరణించగా, మరో పదిమంది జవాన్లు గాయపడ్డారు. ఈ కేసులో భాగంగా పలువురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ముంగర్‌ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాగా దీనిపై విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈరోజు దీనిపై విచారణ జరిపిన కోర్టు ఐదుగురు మావోయిస్టులకు శిక్షను ఖరారు చేశారు. ఆ అయిదుగురికి మరణ శిక్ష తో పాటూ, ఒక్కొక్కరికి పాతిక వేల రూపాయల జరిమానా విధించారు.