సారిక, పిల్లలకు మత్తు ఇచ్చి చంపారా?
posted on Nov 5, 2015 9:10AM

వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు బుధవారం ఉదయం హన్మకొండలో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదు.. హత్యలన్న ఆరోపణలు తీవ్రంగా రావడంతో ఈ దిశలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు వున్న తీరు కూడా ఇవి హత్యేలనన్న అనుమానాన్ని కలిగిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఇదిలా వుంటే, నలుగురు మృతులకు మత్తుమందు ఇచ్చి, ఆ తర్వాత తగులబెట్టి చంపారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా రాజయ్య ఇంట్లోని ఆహార పదార్ధాలన్నిటినీ సీజ్ చేశారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.