వరంగల్ ఉపఎన్నిక నామినేషన్ గడువు పూర్తి.. బరిలో 5గురు

వరంగల్ ఉపఎన్నిక పోరుకు నేటితో నామినేషన్ల గడువు ముగిసింది. ఈ బరిలో మొత్తం 5గురు అభ్యర్ధులు ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రచారం కోసం పార్టీలు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. కాగా ఈ వరంగల్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ తరుపున పసునూరి దయాకర్, వైసీపీ అభ్యర్దిగా నల్లా సూర్యప్రకాశ్, టీడీపీ-బీజేపీ అభ్యర్ధిగా దేవయ్య. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సర్వే సత్యనారాయణ బరిలో దిగనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగిన రాజయ్య.. ఈ రోజు జరిగిన సంఘటనతో పోటీ నుండి తప్పుకొనగా.. కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషంలో సర్వే పేరును ప్రకటించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu