రాహుల్‌గాంధి ట్విట్టర్‌లో ఘోరమైన తిట్లు

 

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడైన రాహుల్‌గాంధి నేడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి జేఎన్‌యూ గురించి ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. జేఎన్‌యూలో జరుగుతున్న పరిణామాలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందనీ, బీజేపీ పాలనా విధానాన్ని తామంతా నిరసిస్తున్నామనీ ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ పత్రం నకలు ఒకటి రాహుల్‌గాంధి కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో ఉంచడంతో, నెటిజన్లు తమదైన శైలిలో దానికి సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు. రాహుల్‌గాంధి కార్యాలయం గాంధిగారి మూడు కోతులకీ చిహ్నమని ఒక నెటిజన్ తన స్పందనలో పేర్కొంటే... ఇంతకీ ఆ పత్రం మీద మీ సంతకం లేదు, మీరు వేలిముద్రగానీ వేశారా అంటూ మరొకరు ఎగతాళి చేశారు. వెళ్లి ఛోటాభీం చూసుకోండి అని ఒకరంటే మీకంటే ఔరంగజేబు నయం అని వేరొకరు ట్వీటారు. 'అయితే ఇంతకీ భారతదేశాన్ని నాశనం చేయాలనే నినాదాలను మీరు సమర్థిస్తున్నారా?’ అంటూ మరో నెటిజన్ రాహుల్‌ని ప్రశ్నించారు. ఆయన బుర్ర రైల్వే పట్టా అనీ, సాయం లేకుండా ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాయలేరనీ మరి కొందరు పేలారు. ఇక రాయడానికి కూడా వీల్లేని తిట్లకీ ఆయనకి అందిన జవాబులలో కొదవ లేకుండా పోయింది. పాపం రాహుల్‌. ఇవన్నీ ఆయన చూడకుండా ఉంటే బాగుండు!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu