ఎంపీ లగడపాటి రాజకీయ సన్యాసం
posted on Feb 18, 2014 5:57PM

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్సభ ఆమోదం పొందడంపై మనస్థాపం చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజనను ఆపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశానని, ఇలాంటి రాజకీయాల్లో తాను ఇమడలేనని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి రావొద్దన్నారు. ఈ ఘటన కొత్త రాష్ట్రాల డిమాండ్కు ఊతమిస్తుందని లగడపాటి వెల్లడించారు. ఇక నుండి ప్రజలంతా భారతీయులుగా, తెలుగువారిగా కలిసి మెలిసి ఉండాలని, రాష్ట్ర విభజన గురించి తాను ఇప్పుడు ఏం మాట్లాడిన ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఇక తాను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగలేనని, ప్రజాస్వామ్య దేశంలో రాచరికపు పోకడలు అన్యాయమని ఆయన బాధను వ్యక్తం చేశారు.