బిక్కి కృష్ణ రాసిన "సాయితత్వం - లీలారహస్యం" పుస్తకావిష్కరణ

 

ప్రముఖ కవి, తత్వవేత్త బిక్కి కృష్ణ రాసిన"సాయితత్వం-లీలారహస్యం"అన్న గ్రంథాన్ని విశ్రాంత ఇన్ కం టాక్స్ ఛీప్ కమీషనర్ యం. నరసింహప్ప హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. శ్రీ భం సాయి సేవాట్రస్ ఆధ్వంర్యంలో ప్రముఖ కవి డా. వి. డి. రాజగోపాల్  అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో కవయిత్రులు డా. రాధా కుసుమ,పద్మశ్రీలతలు పుస్తకాన్ని సమీక్షించారు. భారతదేశంలో ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను పరిశోధించి బిక్కి కృష్ణ సాధికారికంగా సాయితత్వం గ్రంథాన్ని రచించారన్నారు. ఈ సమావేశంలో యలవర్తి ధనలక్ష్మి,మారెళ్ళ రాజరాజేశ్వరి, కోగంటి శాంతిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu