పవన్ పాదయాత్ర ప్రారంభం..

 

ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పాదయాత్ర చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు పాదయాత్ర ప్రారంభించారు. ఈ ఉదయం బెంజిసర్కిల్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు రింగు వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. పవన్ కళ్యాణ్‌తో పాటు సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ జాతీయరహదారులపై నడువనున్నారు. పాదయాత్ర ముగిశాక ముగ్గురు మీడియాతో మాట్లాడతారు.