బస్సుపై కాల్పులు.. 47 మంది మృతి

 

పాకిస్థాన్ లో ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో తెలియకుండా ఉంది. ఇప్పుడు కొత్తగా ఓ బస్సుపై కాల్పులు జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం... పాకిస్థాన్ నగర శివార్లలో షియాలు అల్- అజహర్ గార్డెన్ కాలనీలో నివసిస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సుపై విచక్షణా రహింతగా కాల్పలు జరిపారు. ఈ కాల్పులలో 47 మంది చనిపోయారు. అయితే ఉగ్రవాదులు పోలీసుల డ్రస్సులో రావడంతో డ్రైవర్ బస్సు ఆపాడని, ఆగివున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఘటనలో గాయపడిన ఒక బాధితుడు చెప్పాడని పాక్ పోలీసులు తెలిపారు. మొత్తం 60 మంది ఉన్న ప్రయాణికుల్లో అందరూ కూలీలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ దాడి చేసింది తామేనని తెహ్రీక్ - ఏ- తాలిబన్ సంస్థ ప్రకటించింది. దీంతో పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాదుల చేసిన పనిని ఖడించి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు.