వైఫై వున్న మొదటి రైల్వేస్టేషన్ చెన్నై సెంట్రల్

 

ఇది ఇంటర్నెట్ యుగం. ఈ తరం నిరంతరం ఇంటర్నెట్ సదుపాయాన్ని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్ దేశంలోనే వైఫై సదుపాయం కలిగిన మొదటి రైల్వే స్టేషన్‌గా అవతరించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ శుక్రవారం నాడు ఈ రైల్వే స్టేషన్‌లో వైఫై సౌకర్యాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తన మొబైల్‌లో వైఫై సౌకర్యాన్ని పరిశీలించారు. ఇకపై చెన్నై రైల్వే స్టేషన్‌కు వచ్చే వారెవరైనా అరగంట పాటు తమ ల్యాప్ టాప్, మొబైళ్లలో ఉచితంగానే ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. ఉచిత ఇంటర్నెట్ సౌలభ్యంలో భాగంగా డౌన్ లోడింగ్‌పై ఎలాంటి పరిమితి లేదు. అయితే అప్ లోడింగ్‌‌కు మాత్రం ప్రయాణికులకు అనుమతి లేదు. ఇక 30 నిమిషాల పాటు ఉచితంగానే ఇంటర్నెట్‌ను ఉపయోగించిన తర్వాత ప్రయాణికులు ఇంకా ఇంటర్నెట్ కావాలనుకుంటే రీచార్జీ చేసుకోవాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu