ఆసియా క్రీడల్లో ఆర్చరీలో స్వర్ణం

 

ఆసియా క్రీడల్లో ఆర్చరీ పురుషుల విభాగం భారతదేశం తొలిసారి బంగారు పతకాన్ని సాధించింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పోటీలో దక్షిణాఫ్రికా జట్టుపై 227-225 స్కోరుతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ బంగారు పతకంతో ఈ దఫా ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో రెండు బంగారు పతకాలు చేరాయి. అలాగే ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం చేరింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో భారత్‌ టీమ్‌కి కాంస్యం లభించింది. జ్యోతి సురేఖ (విజయవాడ), త్రిష డే, పూర్వా షిండేలతో కూడిన ఆర్చరీ జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu