సత్యార్థి, మలాలాలకి నోబెల్ శాంతి బహుమతి ప్రదానం
posted on Dec 10, 2014 5:08PM

భారతదేశానికి చెందిన బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్థి, పాకిస్థాన్కి చెందిన స్వేచ్ఛాగళం మలాలా యూసఫ్జాయ్ ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కరాన్ని అంటుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో వీరిద్దరికీ సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేశారు. నోబెల్ బహుమతి కింద వీరిద్దరికీ నోబెల్ పతకం, ప్రశంసాపత్రం, 1.1 మిలియన్ డాలర్ల 6.1 కోట్ల రూపాయల నగదు చెరిసగం అందజేశారు. ఈ అవార్డును స్వీకరించడానికి సత్యార్థి తన భార్య సుమేధ, కుమారుడు, కోడలు, కూతురుతో సహా ఓస్లోకు చేరుకున్నారు. మలాలా తన తల్లిదండ్రులతో కలసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ శాంతి బహుమతి ప్రదానానికి ముందు మంగళవారం నాడు ఓస్లోలో జరిగిన చర్చా కార్యక్రమంలో కైలాస్ సత్యార్థి, మలాలా పాల్గొని మాట్లాడారు.