మహారాష్ట్రలో హంగ్..బీజేపీ మంతనాలు!!
posted on Oct 19, 2014 3:28PM

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే బీజేపీ 100కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. శివసేన 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ అయినా 145 స్థానాలు గెలుపొందాలి. కానీ ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, శివసేన మధ్య మంతనాలు కొనసాగుతోన్నట్లు సమాచారం. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి చేపడుదామని శివసేన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. శివసేన ప్రతిపాదనపై సాయంత్రం జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కమలం నేతలు చర్చించనున్నారు. తమకు శివసేన ప్రత్యర్థ పార్టీ కాదని, కాంగ్రెస్, ఎన్సీపీ మాత్రమే ప్రత్యర్థ పార్టీలు అని మహారాష్ట్ర బీజేపీ ప్రకటించింది.