హర్యానాలో బీజేపీదే పీఠ౦

హర్యానాలో భారతీయ జనతాపార్టీ పూర్తి మెజారిటీ సాధించి సంచలనం సృష్టించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకున్న పార్టీ ఈసారి ఏకంగా 46 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ సాగానికిపైగా స్థానాలు గెలుపొంది మ్యాజిక్‌ ఫిగర్‌ను సాధించింది. సుదీర్ఘ కాలంగా హర్యానాలో ప్రాంతీయ పక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న బీజేపీ ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో ఏడింటిలో గెలుపొందింది. బీజేపీకి స్థానికంగా బలమైన నేతలుగా పేరున్న అభిమన్యు, రామ్‌విలాస్‌ శర్మ, ఎంఎల్‌ ఖాతర్‌ తదితరులు గెలుపొందడమే కాకుండా పార్టీ విజయానికి కూడా కృషి చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu