మా పార్టీకే ముఖ్యమంత్రి కుర్చీ....
posted on Sep 15, 2014 1:46PM

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా వుంది మహారాష్ట్రలో శివసే వ్యవహారం. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. శివసేన, బీజేపీ కూటమి అక్కడ పోటీ చేయబోతోంది. ఈసారి ఎన్నికలలో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికే అధికారం దక్కే అవకాశం వుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని శివసేన నాయకులు పేచీ పెట్టుకున్నారు. ఇప్పటికే శివసేన అధిపతి ఉద్ధవ్ థాకరే తానే తానే కాబోయే ముఖ్యమంత్రిని అని ప్రకటించుకుంటూ వున్నారు. తాజాగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కూడా ఇదే విషయాన్ని తాజాగా ప్రకటించారు. బీజేపీకి కూడా ముఖ్యమంత్రి పదవి కావాలనే ఆశ వుండటంలో తప్పులేదు. అయితే మా పార్టీ మాత్రం ముఖ్యమంత్రి పదవిని వదులుకోదని అని స్పష్టంగా ప్రకటించారు. శివసేన నాయకుల వ్యాఖ్యలపై తమ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారి తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం వుందని ఆయన అన్నారు.