విమానం స్క్రూ లూజ్.. తప్పిన ప్రమాదం...

 

మీరు విమానంలోగానీ ఎక్కబోతున్నారా? ఎందుకైనా మంచిది విమానంలో ఎక్కకముందే విమానంలోని అన్ని నట్లూ సరిగ్గా వున్నాయో లేదో చెక్ చేసుకుంటే మంచింది. ఎందుకంటే విమానాల నట్లు లూజైపోయినా పట్టించుకోకుండా గాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలైపోతాయి. ఇలాంటి సంఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎస్జి-451 విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ఇంజన్లో సమస్యను గుర్తించిన పైలట్.. దాన్ని సింగిల్ ఇంజన్తోనే సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేశారు. ఆ తర్వాత పరిశీలిస్తే అర్థమైందేంటంటే, ఇంజన్లో ఒక కీలకమైన నట్టును సరిగ్గా బిగించలేదని. పైలెట్ అయితే సకాలంలో లోపాన్ని గుర్తించి, విమానాన్ని వెనక్కి తిప్పడంతో దాదాపు 175 మంది ప్రయాణికులకు ప్రాణాపాయం త్రుటిలో తప్పింది. ఈ సంఘటనతో ఆ విమానానికి మెయింటెనెన్స్ ఇంజనీర్గా వ్యవహరించి, సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తికి అధికారాలను డీజీసీఏ తొలగించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu